Vivo Y18t: వివో నుంచి బ్లాక్ బస్టర్ 5జీ ఫోన్.. కేవలం రూ.10 వేల లోపే!

వివో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను తాజాగా రిలీజ్ చేసింది. వివో వై18టి 5జీ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో లాంచ్ అయింది. కంపెనీ దీనిని ఒకే వేరియంట్ లో తీసుకుంది. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499గా ఉంది. దీనిని ఫ్లిప్ కార్ట్ లో కొనుక్కోవచ్చు.

New Update
Vivo Y18t smartphone

ప్రముఖ టెక్ బ్రాండ్ వివో భారతదేశంలో కొత్త కొత్త ఫోన్లు లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. Vivo Y18t ని లాంచ్ చేసింది. ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండానే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్ ఇ-స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచింది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీ, Unisoc చిప్‌సెట్‌తో లాంచ్ అయింది. అంతేకాకుండా 50MP ప్రధాన కెమెరా, IP54 రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. ధర కూడా చాలా తక్కువగా ఉండటంతో అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా సామాన్య ప్రియులను ఆకట్టుకుంటుంది. 

Also Read: Harish Rao: రేవంత్ కి త్వరలోనే 70MMలో సినిమా చూపిస్తాం..!

Vivo Y18t price

Also Read: Karnataka: అంబేద్కరే ఇస్లాంలోకి మారాలనుకున్నాడు!

Vivo Y18t స్మార్ట్ ఫోన్ ఒకే వేరియంట్ లో లాంచ్ అయింది. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ భారతదేశంలో రూ.9,499 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇది జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Vivo Y18t specifications

Also Read:  AP Assembly:నేడు అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం

Vivo Y18t స్మార్ట్ ఫోన్ 6.56 అంగుళాల HD + LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 840 నిట్‌ల గరిష్ట ప్రకాశానికి మద్దతు ఇస్తుంది. అలాగే Android 14 ఆధారంగా Funtouch OS 14ని నడుపుతుంది. ఈ ఫోన్ 4GB LPDDR4X RAM, 128GB eMMC 5.1 స్టోరేజ్ తో కూడిన Unisoc T612 చిప్‌సెట్‌లో పని చేస్తుంది. Vivo Y18t 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 0.08 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.

Also Read: Train Accident: పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్...!

సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ షూటర్‌ను కలిగి ఉంది. సేఫ్టీ కోసం, ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP54గా రేటింగ్ కలిగి ఉంది. అతేకాకుండా ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.  దీంతో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Stock Market: పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ క్లోజ్..నష్టాల్లో భారత సూచీలు

భారత్ ఇచ్చిన షాక్ కు పాకిస్తాన్ విలవిలలాడుతోంది. అసలే ఆర్థికంగా చితికిపోయి ఉన్న దాయాది పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారిపోయింది. దెబ్బకు పాక్ స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిపోయింది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్లో కూడా సూచీలు భారీ నష్టాలు చూస్తున్నాయి. 

New Update
pak

Pakistan Stock Exchange

భారత్‌- పాక్ యద్ధం నేపథ్యంలో..పాకిస్తాన్ స్టాక్ ఎక్సెంజ్‌ మూసేసింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ ను కొనసాగించలేమని చెప్పింది. మళ్ళీ కొన్ని రోజుల్లో కలుస్తామని అంది. కాశ్మీర్ లో ఉగ్రదాడి, దానికి నిరసనగా భారత్ చేపట్టిన చర్యలు పాకిస్తాన్ ను చాలా బలంగానే దెబ్బ కొడుతున్నాయి.  వరుసగా 2 రోజుల నుంచి పాక్ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మునిగి తేలుతున్నాయి. అసలే ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్న దాయాదికి ఇది పుండు మీద కారం జల్లినట్టయింది. భారత్ ఇచ్చిన షాక్ కు పాక్ విలవిల కొట్టుకుంటోంది. ఏం చేయాలో తెలియక ఏకంగా స్టాక్ ఎక్స్చేంజ్ నే మూసేసుకుంది. 

exchange
Pakistan Stock Exchange

 

భారత్ లోనూ నష్టాలు..

నిన్నటి వరకు బాగానే ఉన్న భారత స్టాక్ మార్కెట్ ఈరోజు మాత్రం నేల చూపులు చూస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ దేశీయంగా కొనుగోళ్లు ఎక్కువగా అవుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 1000 పాయింట్లు (1.26%) తగ్గి 78,950 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 350 పాయింట్లు (1.44%) తగ్గి 23,900 స్థాయిలో ట్రేడవుతోంది. 30 సెన్సెక్స్ స్టాక్‌లలో 28 స్టాక్‌లు నష్టాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ 4.50% వరకు క్షీణించాయి. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, జొమాటో షేర్లు 3% తగ్గాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు కాస్త పర్వాలేదనిపిస్తున్నాయి. ఇక నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 48 స్టాక్‌లు నష్టాల్లో ఉన్నాయి. NSE మీడియా రంగం 3.46%, ప్రభుత్వ బ్యాంకింగ్ 2.96%, ఫార్మా 2.55%, మెటల్ 2.44% మరియు ఆటో 2.00% క్షీణించాయి. ఐటీ స్టాక్స్‌లో స్వల్ప పెరుగుదల ఉంది. నిన్నటి వరకు బాగానే ఉన్న దేశీ మార్కెట్ ఈరోజు పడిపోవడానికి కారణం భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులే అంటున్నారు నిపుణులు. 

 today-latest-news-in-telugu | stock-market | india 

Also Read: పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం..ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్

Advertisment
Advertisment
Advertisment