ఈ ఏడాది చివరి నాటికి మతిపోయే టెక్నాలజీ.. అంబానీ మరో సంచలన ప్రకటన!

జియో కన్వెన్షన్ సెంటర్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్విడియా సమ్మిట్ 2024లో ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌తో మాట్లాడుతూ ఇప్పుడున్న టెక్నాలజీ కంటే 20 రెట్లు మెరుగైన టెక్నాలజీని ఈ ఏడాది చివరి నాటికి తీసుకొస్తామన్నారు.

New Update

ప్రస్తుతం ఎన్విడియా సమ్మిట్ జియో వరల్డ్ కన్వెన్సన్ సెంటర్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో ఎన్విడియా వ్యవస్థాపకుడు, సీఈవో జెన్సన్ హువాంగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఈ సమ్మిట్‌లో భాగంగా అనేక విషయాలపై చర్చించారు. భారత్ దేశం శక్తి, సామర్థాల గురించి అంబానీ జెన్సన్‌కు వివరించారు. ప్రపంచానికి ఇన్నోవేషన్ హబ్‌గా భారతదేశం తయారవుతుందన్నారు.  

ఇది కూడా చూడండి: IAS Amoy Kumar: ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి.. మాజీ మంత్రికి షాక్!

మిగతా దేశాలతో పోలిస్తే..

అమెరికా, చైనా దేశాలతో పోలిస్తే ప్రపంచంలోనే అత్యత్తమ డిజిటల్ కనెక్టివిటీ భారత్‌లో ఉన్నాయని అంబానీ తెలిపారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌కు అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం జియో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా కంపెనీగా ఉందన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది చివరికి 20 రెట్లు కంప్యూటర్ సామర్థ్యాలు ఉంటాయని అంబానీ తెలిపారు. 

ఇది కూడా చూడండి: Samantha : ప్రభాస్ - సమంత కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

ఇండియా ప్రపంచానికి కేవలం సీఈఓలను ఇవ్వడమే కాకుండా ఏఐ సేవలను కూడా అందిస్తుందని అంబానీ అన్నారు. గతంలో రిలయన్స్ ప్రకటించినట్లు క్లౌడ్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడానికి కావాల్సిన శక్తిని ఎన్విడియా అందిస్తుందన్నారు. దేశంలో ఉండే శాస్త్రవేత్తలు, డెవలపర్లు, స్టార్టప్‌లకు అవసరమైన ఏఐ మౌళిక సదుపాయాలను అందిస్తుంది. అలాగే రిలయన్స్‌కి అవసరమయ్యే ఏఐ చిప్‌లను కూడా ఎన్విడియా అందిస్తోందని అంబానీ తెలిపారు. 

ఇది కూడా చూడండి: Mokshagna : మోక్షజ్ఞ కు జోడిగా స్టార్ హీరోయిన్ కూతురు..?

టెలికాం రంగంలో జియో ఎన్నో సేవలు చేసిందన్నారు. అదే విధంగా ఏఐ రంగంలో మౌలిక సదుపాయాలను అందించడానికి కూడా జియో అంతే విధంగా కృషి  చేస్తుందని అంబానీ తెలిపారు. మిగతా వస్తువుల్లానే ఏఐ కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేసేలా తయారవుతుందని అంబానీ పేర్కొన్నారు. ఎన్విడియా అంటే విద్య అని, దేశానికి జ్ఞానాన్ని తెచ్చిపెట్టేదని అంబానీ అన్నారు. దీంతో ఎన్విడియా సీఈఓ జెన్సన్ ముఖేష్ అంబానీ మాటలకు ఆకర్షితులయ్యారు. అంబానీ 20 ఏళ్ల ఇంజనీర్‌లా మాట్లాడుతున్నారని జాన్సన్ అన్నారు. 

ఇది కూడా చూడండి: ఆ సినిమా ఇప్పుడొచ్చుంటే పాన్ ఇండియా హిట్ అయ్యేది.. రామ్ చరణ్ మూవీపై దుల్కర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Stock Markets: టారీఫ్ లకు బ్రేక్..ఆసియా, వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్లో జోష్

సుంకాలకు బ్రేక్ ఇస్తున్నామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఈరోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికాలో కూడా మార్కెట్లు రికార్డ్ స్థాయిలో లాభపడ్డాయి. మహావీర్ జయంతి కారణంగా భారత స్టాక్ మార్కెట్లకు సెలవు. 

author-image
By Manogna alamuru
New Update
stock market

ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కు తగ్గారు. 90 రోజుల పాటూ టారీఫ్ లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.  దీంతో కొన్ని రోజులుగా అతలాకుతలం అవుతున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఈరోజు పుంజుకున్నాయి. అమెరికా మార్కెట్లు రికార్డ్‌ స్థాయిలో లాభాలను ఆర్జించగా.. ఆసియా మార్కెట్లు కూడా కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు 12% పెరిగాయి. ఆసియా మార్కెట్లు కూడా 10% పెరిగాయి. మహావీర్ జయంతి సెలవుదినం కారణంగా భారత మార్కెట్లు మాత్రం మూసివేయడ్డాయి. 

ఆసియా మార్కెట్లు..

జపాన్ నిక్కీ ఇండెక్స్ 2,660 పాయింట్లు అటే 8.39% పెరిగి 34,370 వద్దకు చేరుకుంది. కొరియా కోస్పి ఇండెక్స్ 110 పాయింట్లు అనగా 4.70% పెరిగి 2400 వద్దకు చేరుకుంది. తైవాన్‌కు చెందిన TAIEX సూచీ 620 పాయింట్లు లేదా 9.35% పెరిగి 19,020 వద్దకు చేరుకుంది. షాంఘై సూచీ మాత్రం స్వల్పంగా 0.6శాతం లాభంతో కొనసాగుతోంది. 

24 ఏళ్ళ తర్వాత సూపర్ డే..

టారీఫ్ లపై ట్రంప్ ప్రకటన తర్వాత బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా దూసుకెళ్లాయి. డౌ జోన్స్ 2,962 పాయింట్లు లేదా 7.87% పెరిగి 40,608 వద్ద ముగిసింది. 2020 ఇది మార్చి నమోదైన అతిపెద్ద లాభం. అలాగే S&P 500 ఇండెక్స్ 9.52% పెరిగి 5,456.90కి చేరుకుంది.  2008 తర్వాత  S&P 500 ఇండెక్స్ అతిపెద్ద సింగిల్-సెషన్ పెరుగుదల ఇది.  మరోవైపు టెక్ స్టాక్స్ ఇండెక్స్ అయిన నాస్డాక్ కాంపోజిట్ 12.16% పెరిగి 17,124 కు చేరుకుంది. నాస్‌డాక్‌ ఒక రోజులో ఇలా రికార్డ్‌ స్థాయిలో లాభపడడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. వాల్ స్ట్రీట్ లో దాదాపు 30 బిలియన్ షేర్లు ట్రేడ్ అయ్యాయి. దీంతో బుధవారం వాల్ స్ట్రీట్ చరిత్రలో అత్యధికంగా ట్రేడ్ అయిన రోజుగా నిలిచింది.

 today-latest-news-in-telugu | stock-markets | asia | trump tariffs 

Also Read: USA: సైనిక చర్యలు తప్పువు..ఇరాన్ డీల్ పై ట్రంప్ మరోసారి..

Advertisment
Advertisment
Advertisment