Jio: అబ్బ అనిపించే జియో రీఛార్జ్ ఆఫర్.. మళ్లీ పాత చీపెస్ట్ ప్లాన్ వచ్చేసిందిగా!

జియో తన పాత రూ.189 రీఛార్జ్ ప్లాన్‌‌ను మళ్లీ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో యూజర్లు 28 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. మొత్తం 2జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందుతారు. 300 ఎస్ఎమ్ఎస్‌లు ఫ్రీగా పొందొచ్చు. పలు యాప్స్‌ ఫ్రీగా వాడుకోవచ్చు.

New Update
Jio Affordable Value Pack rs 189 available

Jio Affordable Value Pack rs 189 available

ప్రముఖ టెలికాం సంస్థ జియో తమ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో తొలగించిన తన చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో యూజర్లకు ఎంతో ఫేవరెట్ అయిన రూ.189 రీఛార్జ్ ప్లాన్‌ని మళ్లీ అందించి సర్‌ప్రైజ్ చేసింది. దీని కోసం ‘అఫోర్డబుల్ ప్యాక్స్’ అని ఒక కొత్త సెక్షన్ తీసుకొచ్చింది. ఈ సెక్షన్‌లోనే రూ.189 ప్లాన్ యాడ్ చేసింది. 

రూ.189 రీఛార్జ్ ప్లాన్‌ బెనిఫిట్స్

ఇక ఈ ప్లాన్ బెనిఫిట్స్ వివరాల విషయానికొస్తే.. ఈ రూ.189 రీఛార్జ్ ప్లాన్‌లో యూజర్లు 28 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. అలాగే ఈ ప్లాన్‌లో మొత్తం 2జీబీ డేటా లభిస్తుంది. ఇంకా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందుతారు. అంతేకాకుండా 300 ఎస్ఎమ్ఎస్‌లు కూడా ఫ్రీగా పొందొచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఎక్స్‌ట్రా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్‌ ఫ్రీగా వాడుకోవచ్చు.

Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!

బడ్జెట్-ఫ్రెండ్లీ వాయిస్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి.. ఇది ప్రస్తుతం Jio నుంచి అత్యల్ప ధర గల వాయిస్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత రూ.199 ప్లాన్ ఉంది. ఈ ప్లాన్‌లో 18 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. డైలీ 1.5జీబీ డేటా పొందొచ్చు. అలాగే రోజుకి 100 ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్‌లో డేటా ఎక్కువ ఇచ్చినా.. వ్యాలిడిటీ మాత్రం తక్కువ అనే చెప్పాలి. 

Also Read :  ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?

ఇదిలా ఉంటే ఇందులోని రూ.1,958 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ.1,748లకే అందుబాటులో ఉంది. దీని వ్యాలిడిటీలో మార్పులు వచ్చాయి. 365 రోజుల వ్యాలిడిటీ ఇప్పుడు 336 రోజులకు తగ్గించారు. దీనితో పాటు రూ.458 ప్లాన్‌ను రూ.448కి సర్దుబాటు చేశారు. కానీ ఇందులో వ్యాలిడిటీ తగ్గించలేదు. 84 రోజుల వ్యాలిడిటీతోనే వస్తుంది. 

Also Read :   ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్‌ రెబల్‌ స్టార్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఆర్బీఐ ఎఫెక్ట్.. ఈ కంపెనీల షేర్లు భారీగా పతనం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల ప్రభావం గోల్డ్ లోన్ కంపెనీలపై భారీగా పడింది. ఆర్బీఐ ప్రకటించిన వెంటనే ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.

New Update
Muthoot finance Shares

Muthoot finance Shares Photograph: (Muthoot finance Shares)

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. అయితే ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో గోల్డ్ లోన్ కంపెనీలపై భారీ ఎఫెక్ట్ పడింది. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు అయితే దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఆర్బీఐ కీలక ప్రకటన చేసిన తర్వాత..

బంగారు ఆభరణాలపై బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీ వంటి నియంత్రిత సంస్థలు గోల్డ్ లోన్లు ఇస్తాయని గవర్నర్ తెలిపారు. అయితే వ్యక్తిగత సంస్థల రిస్క్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోల్డ్ లోన్ నిబంధనలను జారీ చేస్తామని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల గోల్డ్ లోన్ కంపెనీల షేర్లపై ప్రభావం పడింది.

ఇది కూడా చూడండి: Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

ముత్తూట్ ఫైనాన్స్ కోసం బంగారు రుణాలు కంపెనీ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులలో 98 శాతంగా ఉన్నాయి. అదే సమయంలో మణప్పురం ఫైనాన్స్‌లో 50 శాతం, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో 21 శాతం ఏయూఎం గోల్డ్ లోన్స్ నుండి వస్తాయి. ఈ షేర్లు ధరలు 10 శాతం క్షీణించి రూ.2,063 వద్ద ముగిసింది. అదేసమయంలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు ధర 6.66 శాతం క్షీణించి రూ.311.25 వద్ద ముగిసింది. 

Advertisment
Advertisment
Advertisment