లోయలో పడిన బస్సు..18 మంది మృతి..వారిలో ఆరుగురు భారతీయులు!

మెక్సికో నగరంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

New Update
లోయలో పడిన బస్సు..18 మంది మృతి..వారిలో ఆరుగురు భారతీయులు!

Bus Accident in Mexico: మెక్సికో నగరంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఆరుగురు భారతీయులతో పాటు మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పొయారు. 23 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం నయారిట్ రాష్ట్రంలో జరిగింది.

నయారిట్ రాజధాని టెపిక్‌ సమీపంలోని బరాంక బ్లాంకాలో ఈ ప్రమాదం గురువారం జరిగినట్లు సమాచారం. బస్సు లోయలో పడిన సమయంలో బస్సులో సుమారు 42 మంది వరకు ఉన్నట్లు సమాచారం. టిజువానా ప్రాంతానికి సమీపంలో ఉండగా బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి లోయలో పడిపోయింది.

చాలా ఎత్తు నుంచి బస్సు ఒక్కసారిగా కిందపడడంతో బస్సులోని ప్రయాణికుల్లో సుమారు 18 మంది అక్కడికక్కడే మరణించారు. వారిలో ఆరుగురు భారతీయులు(Indians), డొమెనిక్‌ రిపబ్లిక్‌, ఆఫ్రికా(Africa) దేశస్థులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

లోయలో అంత చీకటిగా ఉండటంతో బస్సు ప్రమాద బాధితులను వెలికి తీయడం చాలా కష్టంగా మారింది. ఎంతో కష్టపడి మృతదేహాలను బయటకు తీసినప్పటికీ వాటిని గుర్తించేందుకు చాలా కష్టంగా ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు మెక్సికో(Mexico) బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరగడానికి గల కారణాలు తెలియరాలేదు. కానీ.. మలుపులు ఎక్కువగా ఉన్న రోడ్డుపై డ్రైవర్​.. బస్సును అతివేగంగా నడపటం వల్లే ఒక్కసారిగా అదుపు తప్పి బస్సు లోయలో పడిపోయినట్లు తెలుస్తుంది. దీని పై విచారణ చేపట్టమని అతి త్వరలోనే బస్సు ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా వలసదారులని సమాచారం. మరణించిన వారిలో ఆరుగురు భారతీయులు ఉన్నారని సహాయక సిబ్బందిలో ఒకరు తెలిపారు. కాగా...మెక్సికోలో రోడ్డు ప్రమాదాలు ఇటీవలి కాలంలో ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గత నెలలో ఓక్సాకాలో జరిగిన బస్సు ప్రమాదంలో 29మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్​ మెక్సికోలో జరిగిన బస్సు ప్రమాదంలో 17మంది మరణించారు. వీరందరు వలసదారులే!

Also Read: అమెజాన్‎లో డిస్కౌంట్ ఫెస్టివల్…ఐఫోన్, ఐప్యాడ్‎లపై భారీ తగ్గింపు…!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?

దుబాయ్ నుంచి వచ్చిన భర్తను ప్రియుడితో కలిసి భార్య రజియా చంపేసింది. బాడీని ముక్కలు చేసి భర్త తెచ్చిన బ్యాగ్‌లోనే ప్యాక్ చేసి ఊరికి 55KM దూరంలో పడేశారు. ఎయిర్‌పోర్ట్‌లో QRకోడ్‌ స్టికర్ బ్యాగ్‌పై ఉంది. దానితోనే పోలీసులు కేసు చేధించారు. వారిని అరెస్ట్ చేశారు.

New Update
Uttar Pradesh Deoria

Uttar Pradesh Deoria

విదేశాల నుంచి తిరిగొచ్చిన భర్తను భార్య చంపి ముక్కలు ముక్కలు చేసింది. చివరికి అతను తెచ్చిన బ్యాగ్‌లో ప్యాక్ చేసి 55 కిలో మీటర్ల దూరంలో వేసింది. ఎంత పెద్ద క్రైమ్ చేసిన ఏదో ఓ చిన్న తప్పుతో దొరికిపోతారనే పోలీసుల మాట నిజమైంది. రజియా తన అక్రమ సంబంధానికి కొనసాగించేందుకు భర్త అడ్డు తొలగించుకోవాలని చూసింది. పక్కా ప్లాన్‌తో లవర్, అతని మేనల్లుడితో కలిసి భర్త నౌషాద్ అహ్మద్‌‌ను చంపి సూట్‌కేస్‌లో పెట్టింది. దాన్ని ఊరికి 55 కిలో మీటర్ల దూరంలో పడేశారు.

Also read: Woman kills husband: భర్తకు ఛాయ్‌లో ఎలుకల మందు.. పింటూతో నలుగురు పిల్లల తల్లి లవ్ ట్రాక్

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఇది చోటుచేసుకుంది. పది రోజుల క్రితం దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తిని అతని భార్య, ఆమె లవర్ హత్య చేశారు. బాధితుడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేశారు. దాన్ని ఇంటి నుండి 55 కిలోమీటర్ల దూరంలో పడేశారు. తార్కుల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్ఖౌలి గ్రామంలో ఏప్రిల్ 21న తన పొలంలో అనుమానాస్పద బ్యాగ్ చూసి రైతు జితేంద్ర గిరి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి బ్యాగ్‌ తెరిచి చూస్తే.. ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టిన మొండెం, కాళ్ల కనిపించాయి. తలపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు ఉంది. మృతదేహం గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. ఆ బ్యాగ్‌కు ఒక క్యూర్ కోడ్ ఉంది. అది ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ చెక్కింగ్ సమయంలో వేసింది. ఈ క్యూఆర్ కోడ్‌తో పోలీసులు కేసు ఛేదించారు. 

Also read: ACB caught: అడ్డంగా బుక్కైన మణుగూరు CI.. ఏసీబీకి ఎలా దొరికాడంటే?

విమానాశ్రయ అధికారులతో బార్‌కోడ్‌ను ట్రాక్ చేస్తే మృతుడు మెయిల్ పోలీస్ స్టేషన్‌లోని భటౌలి గ్రామానికి చెందిన నౌషాద్ అహ్మద్‌(38)గా గుర్తించారు. పోలీసులు అతని ఇంటికి వెళ్లినప్పుడు భార్య పోలీసుల ముందే భర్త కనిపించడం లేదని ఏడ్చింది. పోలీసులు ఇంట్లో వెతికగా.. రక్తపు మరకలతో ఉన్న మరో సూట్‌కేస్ దొరికింది. ఆమె ఆస్కార్ ఫర్మామెన్స్‌పై పోలీసులకు అనుమానం వచ్చి వారి స్టైల్లో విచారించారు. దీంతో రజియా, ఆమె ప్రేమికుడితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. భర్తకు స్కెచ్ వేసిన రజియా అతను దుబాయ్ నుంచి తెచ్చిన అదే బ్యాగ్‌ వాడి దొరికిపోయింది. ఆమె మేనల్లుడు రుమాన్‌లో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వస్తు్న్నాడని హత్య చేసినట్లు పోలీసుల విచారణ తేలింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అసలు ఏం అయ్యింది ఈ భార్యలకు.. మానవ విలువలు మట్టికలిసిపోతున్నాయా? నెల వ్యవధిలోనే ఇది ఐదో హత్య. మీరట్‌లో సౌరభ్, అమిత్ కశ్యప్, బరేలీలో కేహర్ సింగ్, హర్యానాలో ప్రవీణ్.. ఇప్పుడు నౌషాద్ అహ్మద్‌. వీరంతా భార్యల  వివాహేతర సంబంధానికి బలైన బాధితులు. ఈ వార్తలు విని పెళ్లీడుకు వచ్చిన యువకులు వివాహం చేసుకోవాలంటే భయంతో వణుకుతున్నారు. బతికుంటే జీవితాంతం.. ఇలా సింగిల్‌గానైనా ఉండొచ్చని అనుకుంటున్నారు.

Also read: Hydrogen Bomb: ప్రపంచానికి మరో విధ్వంసాన్ని పరిచయం చేసిన చైనా

(latest-telugu-news | crime news | wife cuts husband dead body)

 

 

Advertisment
Advertisment
Advertisment