Market Capitalization: బిఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల రికార్డ్.. భారీగా పెరిగిన మార్కెట్ క్యాప్.. 

బిఎస్ఇ  లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. మొదటిసారిగా 4 ట్రిలియన్ డాలర్లకు అంటే సుమారు 333 ట్రిలియన్ రూపాయలకు చేరుకుంది. మే 2007లో ఒక ట్రిలియన్ డాలర్లకు చేరిన మార్కెట్ క్యాప్ ఇప్పుడు 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకొని రికార్డ్ సృష్టించింది. 

New Update
Market Capitalization : నాలుగుకోట్ల కోట్ల రూపాయలు.. రికార్డ్ సృష్టించిన కంపెనీల మార్కెట్ క్యాప్.. 

Market Capitalization: స్టాక్ మార్కెట్లో నిరంతర పెరుగుదల కారణంగా, బిఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(Market Capitalization) నవంబర్ 29 న మొదటిసారిగా 4 ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు 333 ట్రిలియన్ రూపాయలు దాటింది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇది 600 బిలియన్ డాలర్లు పెరిగింది. బెంచ్ మార్క్ సెన్సెక్స్ సెప్టెంబర్ 15 నాటి రికార్డు గరిష్ట స్థాయి నుంచి 2 శాతం క్షీణించింది.

సెన్సెక్స్ 727 పాయింట్లు లాభపడి 66,901 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 206 పాయింట్లు లాభపడి 20,096 వద్ద ముగిసింది. మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో 26 లాభపడగా, 4 నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం టాప్ గెయినర్స్ గా నిలిచాయి. నెస్లే, టైటాన్ షేర్లు అత్యధిక పతనాన్ని చవిచూశాయి.

ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయిన ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ) షేరు ధర 56.25 శాతం పెరిగి రూ.50 వద్ద ముగిసింది. దీని ఇష్యూ ధర రూ.32. అదేసమయంలో మరింత పెరిగి రూ.28 (87.50%) పెరిగి రూ.60 వద్ద ముగిసింది. 

44 కొత్త కంపెనీలు.. 

ఈ ఏడాది ఇప్పటి వరకు 44 కొత్త కంపెనీలు మార్కెట్లో లిస్టయ్యాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో స్టాక్ మార్కెట్ క్యాప్ పెరిగింది. దీనికి తోడు కొత్త ఇన్వెస్టర్ల రాకతో మార్కెట్ కు మద్దతు లభిస్తోంది. 

Also Read: పండగల్లో కార్లు తెగ కొనేశారు.. టూవీలర్స్ ఎక్కడ ఎక్కువ కొన్నారంటే.. 

బిఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల స్టాక్ మార్కెట్ క్యాప్ పెరుగుతూ వచ్చింది ఇలా.. 

  • మే 2007లో, బిఎస్ఇ-లిస్టెడ్ కంపెనీలు $1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ సాధించాయి.
  • ఇది రెట్టింపు కావడానికి పదేళ్లు పట్టింది. 2017 జూలైలో మార్కెట్ క్యాప్ 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
  • 2021 మేలో మార్కెట్ క్యాప్ 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే, ఐదేళ్ళలోనే రెట్టింపు అయ్యాయి. 

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) నవంబర్ 28న రూ.783.82 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) తాత్కాలిక గణాంకాలు వెల్లడించాయి. ఇదే సమయంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ.1,324.98 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

మంగళవారం.. నవంబర్ 29న సెన్సెక్స్

నిన్న 204 పాయింట్లు లాభపడగా, అంతకు ముందు నవంబర్ 28 మంగళవారం స్టాక్ మార్కెట్ పుంజుకుంది. సెన్సెక్స్ 204 పాయింట్లు లాభపడి 66,174 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 95 పాయింట్లు లాభపడి 19,889 వద్ద ముగిసింది. మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో 23 లాభపడగా, 7 నష్టపోయాయి. అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు 20 శాతం పెరిగాయి.

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు