Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్టు.. గాంధీ ఆసుపత్రిలో ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్నాయక్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండగా.. ఆయన్ని పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. By B Aravind 01 Jul 2024 in Latest News In Telugu వరంగల్ New Update షేర్ చేయండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగుల డిమాండ్ల కోసం గాంధీ ఆసుపత్రిలో ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్నాయక్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన్ని పరామర్శించేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలోనే పోలీసులు పల్లాను అదుపులోకి తీసుకోని బొల్లారం స్టేషన్కు తరలించారు. Also Read: తెలంగాణలో 8 మంది ఐపీఎస్లు బదిలీ పల్లాతో పాటు మరికొందరిని అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్రావు ఎక్స్ వేదికగా ఖండించారు. నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించకుండా.. పరామర్శించేందుకు వెళ్లినవారిని అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో హామీలిచ్చిన నేతలకు నిరుద్యోగుల ఆవేదనలు ఎందుకు అర్థం కావడం లేదన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని.. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. Also read: భార్యల సోషల్ మీడియా అకౌంట్లపై భర్తల పెత్తనం.. హైకోర్టు కీలక తీర్పు! #telangana-news #brs #unemployment #palla-rajeshwar-reddy #telugu-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి