PV Narasimha Rao: మాజీ ప్రధానికి పీవీ నరసింహరావుకు భారత రత్న.. కేటీఆర్ ఏమన్నారంటే

మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ప్రకటించడంపై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హోదాలో అనేకసార్లు పీవీకి భారతరత్న ప్రకటించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.

New Update
PV Narasimha Rao: మాజీ ప్రధానికి పీవీ నరసింహరావుకు భారత రత్న.. కేటీఆర్ ఏమన్నారంటే

కేంద్ర ప్రభుత్వం.. మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ, తెలుగు ప్రజల గౌరవం మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఆయనకు భారతరత్న ప్రకటించడం పట్ల ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హోదాలో అనేకసార్లు పీవీకి భారతరత్న ప్రకటించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.

Also Read: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించి భారతరత్న ప్రకటించాలని కోరిన విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు పీవీతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరితవిప్లవకారుడు స్వామినాథన్ కూడా కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది.

మరోవైపు బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కూడా స్పందించారు. తెలుగు ప్రజలకు ప్రత్యేకించి తెలంగాణకు దక్కిన గౌరవమిదని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డకు అత్యున్నత పురస్కారం లభించడం ఆ జిల్లావాసిగా గర్వపడుతున్నానని అన్నారు. దేశం కోసం ఎంతో సేవ చేసిన పీవీ నర్సింహారావును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. పీవీని కేవలం రాజకీయ లబ్దికే వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అంటూ ధ్వజమెత్తారు. రాజకీయాలకు అతీతంగా దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తించి దేశ అత్యున్నత పురస్కారం అందించిన మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉత్సవాలు నిర్వహించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సైతం పీవీకి భారత రత్న ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగువారికి దక్కిన గౌరవం అని.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

Also Read: దళిత మహిళపై దారుణం.. నడి బజార్లో నగ్నంగా కట్టేసి కొట్టిన గ్రామ పెద్దలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Omar Abdullah: పాక్‌ ప్రధానిపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధానిపై జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ విమర్శించారు. ఈ దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం దీనిపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు తాము రెడీగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. '' పహల్గాంలో చోటుచేసుకున్న దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదు.

Also read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఈ ఘటన వెనుక భారత్ ఉందని వాళ్లే మొదటగా ఆరోపించారు. మనపై ఎప్పుడూ ఆరోపణలు చేసేందుకు ముందుండే వాళ్లకు ఇప్పుడు మనమేమి చెప్పలేం. వాళ్లు చేసిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదని'' సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడాన్ని ఆయన ఖండించారు.  

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

ఇదిలాఉండగా.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. '' భారత్‌ నుంచి కచ్చింతగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్‌ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. యూరీ దాడి తర్వాత 89లో భారత్‌ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్‌ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్‌ దాడి చేసే అవకాశం ఉందని'' అబ్దుల్ బాసిత్ అన్నారు.

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

telugu-news | rtv-news | national-news | Omar Abdullah 

Advertisment
Advertisment
Advertisment