MLA KTR : రైతుభరోసా ఊసే లేదు.. కేటీఆర్ విమర్శలు TG: సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రుణమాఫీ అయిన రైతులకన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ ఉన్నాయని అన్నారు. జూన్లో వేయాల్సిన రైతుభరోసా.. జూలై వచ్చినా రైతుల ఖాతాలో ఎందుకు వెయ్యలే అని ప్రశ్నించారు. By V.J Reddy 19 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Rythu Bharosa : రుణమాఫీ (Runa Mafi) అయిన రైతులకన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). రుణమాఫీ మార్గదర్శకాలు.. పథకానికి మరణ శాసనాలు అయ్యాయని అన్నారు. అర్హత ఉన్నా రుణమాఫీ ఎందుకు కాలేదో చెప్పేవారు లేరని.. అర్హులైనవారు రుణమాఫీ కాక ఆందోళనలో ఉంటే సంబురాలా? అని ప్రశ్నించారు. మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా సంబురాలు?, 30 లక్షల మంది రైతులను మోసం చేసినందుకా సంబురాలు? అని విమర్శించారు. రెండు సీజన్లు అయినా రైతుభరోసా ఊసే లేదని అన్నారు. కేటీఆర్ ట్విట్టర్ (X)లో.." సీఎం గారు... ఊరించి.. ఊరించి..ఏడునెలలు ఏమార్చి చేసిన..మీ రుణమాఫీ తీరు చూస్తే.. తెలంగాణ (Telangana) ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే..“ చారాణ కోడికి..! బారాణ మసాలా...!! ”. రుణమాఫీ అయిన రైతులకన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ, ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు..!, రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలైనై..!! అన్నివిధాలా అర్హత ఉన్నా.. ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు... రైతులు గోడు చెప్పుకుందామంటే వినేటోడు లేడు... అర్హులైన లబ్దిదారులు.. రుణమాఫీ కాక.. అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలు ?, నలభై లక్షల మందిలో.. మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ?, ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా ?, రెండు సీజన్లు అయినా రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలే.. జూన్ లో వేయాల్సిన రైతుభరోసా.. జూలై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలే..!!., కౌలు రైతులకు.. ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలే..!!, రైతు కూలీలకు.. రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలే..!!, మభ్యపెట్టే మీ పాలన గురించి.. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇంతకాలం.. అటెన్షన్ డైవర్షన్..!, ఇప్పుడేమో.. ఫండ్స్ డైవర్షన్..!!" అంటూ రాసుకొచ్చారు. Also Read : స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా #telangana #cm-revanth-reddy #brs-mla-ktr #rythu-bharosa సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి