Hydra-Harish Rao: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హరీష్‌రావు ఛాలెంజ్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలాల కింద ఉన్న హైడ్రా ఆఫీసు, జీహెచ్ఎంసీ ఆఫీసులను కూల్చుతారా? అంటూ ప్రశ్నించారు. నక్లెస్‌రోడ్ పక్కనున్న రెస్టారెంట్స్, ఇతర వాణిజ్య భవనాల సంగతేంటో చెప్పాలని సవాల్ విసిరారు.

author-image
By Nikhil
New Update
Hydra-Harish Rao: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హరీష్‌రావు ఛాలెంజ్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు (Hydra Ranganath) హరీష్‌రావు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. హైడ్రా ఆఫీసు బుద్ధ భవన్ నాలా కింద ఉందని.. దాన్ని కూలగొడతారా? అని ప్రశ్నించారు. రంగనాథ్ ముందు తన ఆఫీస్ కూలగొట్టుకుని ఇతర బిల్డింగులు కూల్చాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఆఫీసు నాలా కింద ఉందని.. దాన్ని కూలగొడతారా? అని ప్రశ్నలు గుప్పించారు. నెక్లెస్‌రోడ్ పక్కనున్న రెస్టారెంట్స్, ఇతర వాణిజ్య భవనాలను కూడా కూలుస్తారా? అని అన్నారు. ఇంకా.. మీరాలం, ఉప్పల్, రామంతాపూర్ చెరువుల్లో వచ్చిన టవర్ల సంగతేంటో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతల సర్కార్ అని ధ్వజమెత్తారు. హైదరాబాద్ బ్రాండ్‌ను కూల్చివేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment