/rtv/media/media_files/2025/04/12/45kdwAlx4FaprMZIrUEv.jpg)
SRK VS PBKS
హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్లsy 141 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్ చేయించింది. మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది. ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు. చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు.
పంజాబ్ కూడా దుమ్మ రేపింది..
అంతకు ముందు సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్లోని ఉప్పల్లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్గా క్రీజులోకి ప్రభ్మన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్ పటేల్ బౌలింగ్లో (3.6) ప్రియాంశ్ ఆర్య (36) నితీశ్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు.
today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks
Also Read: USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు
Asaduddin: కేసీఆర్ నిజం చెప్పండి.. విలీనంపై అసదుద్దీన్ సూటి ప్రశ్న!
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తున్నారా? లేదా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారా? చెప్పాలంటూ కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
BRS-BJP: బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ స్పందించారు. మంగళవారం ఇదే అంశంపై మీడియా సమావేశం నిర్వహించిన అసదుద్దీన్.. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తున్నారా? లేదా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారా? అంటూ కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు ఈ అంశంపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓటమి తర్వాత అంటిముట్టనట్లే..
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు మిత్ర పక్షంగా ఉన్న ఎంఐఎం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అంటిముట్టనట్లే ఉంటుంది. అంతేకాదు బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే బీజేపీకి మద్దతు ఇచ్చారు. బీఆర్ఎస్ 8 చోట్ల డిపాజిట్ కోల్పోవడానికి క్రాస్ ఓటింగే కారణమైంది. బీఆర్ఎస్ ఇలా ఎందుకు చేసిందో నాకైతే తెలియదు. రాజకీయ వ్యూహంలో భాగం అనుకున్నా. అది తప్పుడు వ్యూహం అని ఒవైసీ గతంలోనూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే..
అలాగే జమ్ముకశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదుల దాడిలో ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందడంపై స్పందించారు. మన సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని విమర్శించారు. తీవ్రవాదుల ఇండ్లలోకి వెళ్లి మట్టుబెడతామని ప్రధాని మోదీ తరచూ చెబుతుంటారని, ఆయన అలా చెబుతుంటే ఇప్పుడు జరుగుతున్నదేంటని నిలదీశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. కాషాయ పాలకులు ఉగ్రవాదాన్ని నియంత్రించలేకపోతున్నారని విమర్శించారు.
SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ ఏం ఆడింది మామా..
ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి
భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
SRH VS PBKS: అభిషేక్ శర్మ వీర బాదుడు..40 బంతుల్లో సెంచరీ
చాలారోజుల తర్వాత హైదరాబాద్ స్ రైజర్స్ బ్యాటర్లు విజృంభించారు. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ లు చితకొట్టారు. అభిషేక్ శర్మ ఏకంగా 40 బంతుల్లో సెంచరీని కొట్టి తగ్గేదే ల్యా అని చెప్పాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు
సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…
ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు..మరోవైపు సొంత అక్క ఆర్థికంగా బాగుండంతో అక్క ఇంటికే కన్నం వేసింది. క్రైం | Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
Ontimitta Kodandaramundu : వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముని రథోత్సవం
ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..
AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..
BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి
SRH VS PBKS: అభిషేక్ శర్మ వీర బాదుడు..40 బంతుల్లో సెంచరీ