Niranjan Reddy: కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే.. మాజీ మంత్రి నిరంజన్ కీలక వ్యాఖ్యలు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తుందని సెటైర్లు వేశారు. తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి కరంటు కోతలు మొదలయ్యాయని అన్నారు. By V.J Reddy 18 Feb 2024 in Latest News In Telugu మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి Ex Minister Niranjan Reddy: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తుందని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్, కేసీఆర్ మీద బురదజల్లిన బీజేపీ కాంగ్రెస్ ను హామీల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదని ఫైర్ అయ్యారు. ఏం జరగలేదు.. ఉచిత బస్సు తప్ప 72 రోజులలో కొత్తగా తెలంగాణలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలు, హామీలకు పరిష్కారం లేదు.. ప్రత్యామ్నాయం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం ఏం చేసింది? అంతకన్నా ఏం మెరుగ్గా చేస్తాం అన్నది ప్రభుత్వం చెప్పకపోవడం విచారకరం అని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించి బడ్జెట్ లో సరిపడా కేటాయింపులు లేవని పేర్కొన్నారు. 72 రోజులలోనే గ్యారంటీల అమలు సాధ్యం కాదని బడ్జెట్ ద్వారా తేల్చిచెప్పిందని అన్నారు. ALSO READ: వారికి వడ్డీ లేని రుణాలు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం! మేడిగడ్డ కుంగిపోతే.. మేడిగడ్డలో మూడు పిల్లర్ల కుంగుబాటును భూతద్దంలో చూపి గత ప్రభుత్వ తొమ్మిదిన్నరేళ్ల పాలనను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. హరీష్ రావు జవాబులకు కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి తట్టుకోలేకపోయారని పేర్కొన్నారు. అందుకే అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని తెలిపారు. సాంప్రదాయాలకు భిన్నంగా ఇరిగేషన్ చర్చకు ఇతర శాఖల మంత్రులు స్పందించడం విడ్డూరం అని అన్నారు. 15 మాసాల క్రితం హిమాచల్, 8 మాసాల క్రితం కర్ణాటకలో, 72 రోజుల క్రితం 10, 5, 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలులో విఫలమయిందని గుర్తు చేశారు. కరంటు కోతలు.. తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి కరంటు కోతలు మొదలయ్యాయని అన్నారు. మూడెకరాలకు మించి రైతుబంధు ఇంత వరకూ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. రైతుభరోసా అమలు చేస్తారా ? చేయరా ? ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు రూ.15 వేలు ఇవ్వడం మీద ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉందని ఆరోపించారు. కాళేశ్వరంపై అత్యన్నతస్థాయిలో విచారణ జరిపించండి .. ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది.. ఏ చర్యకైనా, విచారణకైనా బీఆర్ఎస్ సిద్దం అని అన్నారు. అన్యాయం చేయవద్దు.. బీఆర్ఎస్ మీద కక్ష్యతో రైతులకు వచ్చే నీళ్ల విషయంలో అన్యాయం చేయవద్దని కోరారు. కాళేశ్వరం కింద ఉన్న రిజర్వాయర్లు, టన్నెళ్లను వాడుకునేందుకు అవకాశం ఉందని అన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ల సరఫరా విషయంలో స్పష్టత లేదని అన్నారు. పేర్లు మారుస్తారా ? ఏం చేస్తరో ప్రజలకు అందాల్సినవి అందేలా చూడండి అని పేర్కొన్నారు. ఆలేరు మెడికల్ కళాశాల కొడంగల్ కు తరలించడం పద్దతికాదని అన్నారు. DO WATCH: #2024-lok-sabha-elections #bjp #brs-party #brs-ex-minister-niranjan-reddy #congress #medigadda-barrage సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి