High BP: బీపీ ఎక్కువగా ఉంటే రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తాయి

చెడు జీవనశైలి, పనిఒత్తిడి, సరైన ఆహారం, జన్యుపరమైన కారణాల వల్ల వచ్చిన అధిక BPని జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని వైద్యులు అంటున్నారు. నిద్రలేమి, తరచూ మూత్ర విసర్జన, విపరీతమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే రక్తపోటుకు సంకేతం.

New Update
Health Tips : బీపీ ఉన్నవాళ్లు ఈ పండ్లను తింటే.. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ లాగా పనిచేస్తాయి..!!

High BP: ప్రస్తుత రోజుల్లో చెడు జీవనశైలి, పని ఒత్తిడి కారణంగా అధిక రక్తపోటు సమస్య పెరుగుతోంది. అంతేకాకుండా వయస్సు, ఒత్తిడి, సరైన ఆహారం, జన్యుపరమైన కారణాల వల్ల కూడా అధిక BP కనిపిస్తుంది. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని వైద్యులు అంటున్నారు.

రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయా?

  • అధిక రక్తపోటు సంకేతాలు రాత్రిపూట ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలను ఎప్పుడూ విస్మరించకూడదు. సకాలంలో చికిత్స చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రాత్రిపూట తీవ్రమైన ఛాతీ నొప్పి ఉంటే లేదా నొప్పి అలాగే కొనసాగితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది అధిక రక్తపోటుకు సంకేతం.

నిద్రలేమి:

  • రాత్రి సమయంలో మంచి నిద్ర లేకపోయినా అది అధిక రక్తపోటుకు సంకేతమని వైద్యులు అంటున్నారు.

తరచూ మూత్ర విసర్జన:

  • అధిక రక్తపోటు కారణంగా రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు వల్ల రక్త నాళాలపై ఒత్తిడి ఉంటుంది. ఇది మూత్రపిండాలను ప్రభావితం చేయడంతో పాటు శరీరంలోని ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు.

విపరీతమైన అలసట:

  • కారణం లేకుండా అలసటగా అనిపించడం లేదా చిన్నపాటి పని చేసినా అలసిపోవడం, బలహీనంగా అనిపిస్తే అది అధిక రక్తపోటుకు సంకేతం కావచ్చని వైద్యులు అంటున్నారు. దీని కారణంగా గుండె దెబ్బతింటుందని, కంటి చూపును కూడా ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:

ఉన్నట్టుండి శ్వాస ఆడకపోవడం అధిక రక్తపోటుకు సంకేతం. శారీరకంగా చురుకుగా ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: వెజిటేబుల్‌ బిర్యానీ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:  ఖాళీ కడుపుతో పసుపులో నెయ్యి కలిపి తింటే కలిగే ప్రయోజనాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment