Eggs: ఉడకబెట్టిన తర్వాత గుడ్లు ఎంతసేపటిలో తినాలి..?

ఉడికించిన గుడ్లను 5-7 రోజులు ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఉడకబెట్టేటప్పుడు గుడ్డు పెంకు పగిలితే మాత్రం 2-3 రోజుల్లోనే తినాలి లేదా గుడ్డు పాడైపోతుంది. ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కోలిన్ ఉంటాయి.

New Update
Bealert : చిన్నారి ప్రాణం తీసిన గుడ్డు..చిన్నపిల్లలకు గుడ్డు తినిపించే పేరెంట్స్ జాగ్రత్త..!!

Eggs: గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్లలో పోషకాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఉడకబెట్టిన గుడ్లను ఎంత సేపు తినాలి అనేది చాలామందిలో డౌట్‌ ఉంటుంది. కొందరూ అల్పాహారం కోసం ఉడకబెట్టిన గుడ్లు తింటే. మరి కొంతమంది ఆమ్లెట్లను తింటారు. గుడ్లు ప్రోటీన్‌కు ఓ గని లాంటిదని, శరీరం ఫిట్‌గా ఉండాలంటే ప్రతిరోజూ గుడ్లు తినాలని నిపుణులు చెబుతున్నారు. ఉడకబెట్టిన గుడ్లు తినడానికి ఇష్టపడితే, అవి ఎంతసేపటిలో తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉడకబెట్టిన గుడ్ల వల్ల ప్రయోజనాలు:

గుడ్లలో ఉండే పోషకాలు బాడీ ఎనర్జీని ఇస్తుంది. గుడ్లలో ప్రోటీన్, ఎరోన్, విటమిన్-ఏ, బీ-6, బీ-12, ఫోలేట్, సెలీనియం, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు, పుష్కలంగా ఉంటాయి. అల్పాహారం నుంచి స్నాక్స్ వరకు ప్రతి ఒక్కరూ గుడ్లు తింటారు.ఇలా ప్రతిరోజూ ఉడకబెట్టిన గుడ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కోలిన్ ఉంటాయి. ఉడకబెట్టిన గుడ్డు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుడ్లలో లభించే సెలీనియం చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉడికించిన గుడ్లలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును మెరిసేలా, జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

గుడ్ల ఎన్ని గంటల తరువాత తినాలి..?:

  • ఉడకబెట్టిన గుడ్డు ఫ్రిడ్జ్‌లో 5-7 రోజులు తాజాగా ఉంటుంది.
  • గుడ్లను మెత్తగా ఉడకబెడితే 2 రోజుల్లో తినాలి.
  • ఉడకబెట్టేటప్పుడు గుడ్డు పెంకు పగిలితే 2-3 రోజుల్లో తినాలి.
  • గుడ్డు ఉడికిన తర్వాత చల్లటి నీటిలో ఉంచాలి. అవి చల్లారిన తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడవాలి.
  • నీరు ఆరిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. అలాంటి గుడ్లలో బ్యాక్టీరియా ఉండదు.

ఇది కూడా చదవండి: పిల్లలు మొబైల్స్‌కు బానిసగా మారారా..? ఎలా బయటపడాలి..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.

ఇది కూడా చదవండి: ఆహారంలో ఉప్పు ఎక్కువైతే కిడ్నీల సమస్య వస్తుందా..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment