Tillu Square OTT : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ మూవీ!

సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు కు సీక్వల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ బంపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ అయ్యింది.అయితే టిల్లు స్క్వేర్ ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ఫిక్స్ ఖరారైయింది.అదేప్పుడో చూసేయండి!

New Update
Tillu Square: ఓటీటీలోకి టిల్లన్న ఎంట్రీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Update : సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సిద్ధు పదేళ్ల క్రితమే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. నాగ చైతన్య జోష్ సినిమాతో ఆయన తన సినీ కెరీర్‌ను ప్రారంభించాడు. ఇక ఆ మధ్య డీజే టిల్లు(DJ Tillu) అంటూ వచ్చి బంపర్ హిట్ అందుకున్నాడు సిద్ధూ. ఈ సినిమా ఫిబ్రవరి 12న 2022న విడుదలై మంచి బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. అంతేకాదు అటు ఓవర్సీస్‌లో కూడా మంచి కలెక్షల్స్‌ను రాబట్టింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా టిల్లు 2 వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 125 కోట్లు వసూలు చేసి వావ్ అనిపించింది.

ఇక అది అలా ఉంటే టిల్లు స్క్వేర్(Tillu Square) మూవీ OTT స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చి 29న విడుదలైన ఈ సినిమా ఏప్రిల్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్‌(Netflix) లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన రానుంది. ఈ చిత్రానికి సుమారు 14 కోట్ల వరకు డీల్ కుదిరిందని అంటున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్‌గా చేసింది. రామ్ మిర్యాల, అచ్చు, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.ఇక ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాలో అనుపమ గ్లామర్ రోల్ చేయడం ఓ ఛాలెంజ్ అయితే.. దాన్ని తన మార్క్ నటనతో కేక పెట్టించింది. అందాల ఆరబోతే కాదు.. నటనతోను మెప్పించింది అనుపమ. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ సినిమాకు కొనసాగింపుగా టిల్లు 3 కూడా రానుందట. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన రానుంది.

Also Read : మిల్క్ షేక్ ల్లో గంజాయి పౌడర్.. పాలు, హార్లిక్స్, బూస్ట్ లో గుర్తించిన హైదరాబాద్ పోలీసులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment