Mood Of the Nation Survey 2024: ఈసారి కూడా బీజేపీదే హవా..మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే 2024

మరో రెండు నెలల్లో 2024 పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఈ మూడ్‌లోకి వచ్చేశాయి. మళ్ళీ తమదే అధికారం అంటూ బీజేపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిలో మళ్ళీ బీజేపీదే హవా అంటూ మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 సర్వే రిపోర్ట్ ఇచ్చింది.

New Update
Mood Of the Nation Survey 2024: ఈసారి కూడా బీజేపీదే హవా..మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే 2024

Mood Of the Nation Survey - BJP Will Win: ఎన్నికలు సమీపిస్తున్నాయి. అందరూ అదే మూడ్‌లో ఉన్నారు. ఎక్కడ చూసినా ఏ పార్టీ గెలుస్తుంది. ఈసారి ఎవరు అధికారంలోకి వస్తుంది అంటూ చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రా వారీగా ఎవరు గెలుస్తారనే దాని మీద ప్రజలు చర్చించుకుంటున్నారు. సరిగ్గా ఈ విషయం మీదనే ఇండియా టుడే (India Today) మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించింది. ఇందులో ఉత్తరాదిలో మళ్ళీ బీజేపీనే అధికారంలో వస్తుందని తేలింది. బీజేపీ, దాని మిత్ర పక్షాలకు తిరుగులేదని సర్వేలో తెలిసింది.

రాఫ్ట్రాల వారీగా బీజేపీ దక్కించుకునే సీట్లు...సర్వే..

బీహార్-40 సీట్లు
ఎన్డీయే -32
ఇండియా కూటమి- 8

2019 ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీయేకు 39 వచ్చాయి. ఆ సంఖ్య ఈ సారి 7 తగ్గనుంది.

పశ్చిమ బెంగాల్-42 సీట్లు
బీజేపీ- 19
తృనమూల్ కాంగ్రెస్ -22

ఉత్తర ప్రదేశ్- 80 సీట్లు
బీజేపీ - 70
ఇండియా కూటమి - 10

హిమాచల్ ప్రదేశ్ -4 సీట్లు
బీజేపీ -4
ఇండియా కూటమి - 0

జమ్మూ-కాశ్మీర్- 5 సీట్లు
బీజేపీ - 2
ఇండియా కూటమి -3

హర్యానా - 10 సీట్లు
బీజేపీ - 8
ఇండియా కూటమి -2

పంజాబ్ - 13 సీట్లు
బీజేపీ - 2
ఆప్- 5
కాంగ్రెస్ -5
ఎస్ఏడీ -1

ఉత్తరాఖండ్ - 5 సీట్లు
బీజేపీ - 5
ఇండియా కూటమి -0

జార్ఖండ్- 14 సీట్లు
బీజేపీ - 12
ఇండియా కూటమి -2

అస్సాం - 14 సీట్లు
బీజేపీ -12
ఇండియా కూటమి 02

కర్ణాటక- 28

బీజేపీ - 24
కాంగ్రెస్ 04

తమిళనాడు - 39

ఇండియా కూటమి 39
ఎన్డీయే -0

Also Read:ఆంధ్రాలో ఈ సారి టీడీపీనే గెలుస్తుంది-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment