BJP MLA: మిత్రపక్ష నాయకుని పై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు!

తనకు తన కుమారుడికి ప్రాణ హానీ ఉందన్న భయంతోనే శివసేన నేత మహేష్‌ గైక్వాడ్‌ పై కాల్పులు జరిపినట్లు బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్‌ తెలిపారు. కేవలం తన కుమారుడ్ని రక్షించుకోవడంతో పాటు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు ఎమ్మెల్యే వివరించారు.

New Update
BJP MLA: మిత్రపక్ష నాయకుని పై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు!

Bjp Mla: పోలీసు స్టేషన్ (Police Station) లో తన కుమారుడి మీద దాడికి యత్నించిన వారి నుంచి తన కుమారుడ్ని , తనను రక్షించుకోవడం కోసమే నేను శివసేన నాయకుడి పై కాల్పులు జరిపాను అంటున్నాడు మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే(Bjp Mla)  గణపత్‌ గైక్వాడ్‌. కేవలం ఈ కాల్పులు (Gun Shoot) ఆత్మరక్షణ కోసమే చేసినట్లు ఆయన వివరించారు. ఈ విషయం గురించి బాధపడాల్సిన అవసరం ఏం లేదని ఆయన వివరించారు.

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్‌ షిండే (Eknadh Shindey) శివసేన వర్గానికి చెందిన నేత పై బీజేపీ ఎమ్మెల్యే శుక్రవారం కాల్పులు జరిపారు. ద్వార్లీ గ్రామంలోని ఓ భూవివాదం పై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గణపతి గైక్వాడ్‌ , ఆయన కొడుకు వైభవ్‌ గైక్వాడ్ పోలీసు స్టేషన్‌ కు వచ్చారు. ఆ సమయంలోనే మహేశ్‌ గైక్వాడ్‌ రాహుల్ పాటిల్ తో పాటు ఇతర కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చారు.

ఇరువురి నేతలను కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. ఆ సమయంలోనే బయట నేతలు ఆందోళనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా గణపతి గైక్వాడ్‌ తుపాకీతో కాల్పులు ప్రారంభించారు. గణపతి ..మహేష్‌ గైక్వాడ్‌ , మరో నేత రాహుల్‌ పాటిల్‌ పై తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కాల్పుల్లో మహేష్‌ గైక్వాడ్‌, రాహుల్‌ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరుపుతున్న సమయంలో గణపతి గైక్వాడ్‌ చేతికి తీవ్రంగా గాయం అయ్యింది. దీంతో మహేష్‌ గైక్వాడ్‌, రాహుల్‌ ను థానే లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహేష్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్‌ తో పాటు మరో ఇద్దరిని పోలీసు అధికారులు అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన గురించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ఠాక్రే వర్గం దుమ్మెత్తిపోస్తుంది.

పోలీసు స్టేషన్‌ లోనే బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరిపాడు అంటే..వాళ్లకు చట్టం అన్న , పోలీసులు అన్న భయం లేదని అర్థం చేసుకోవాలని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిలైందని మండిపడ్డారు.

Also read: అమెరికాకు హమాస్‌ వార్నింగ్‌…త్వరలోనే ప్రతిఫలం ఉంటుంది!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

రేప్ కేసులో ట్విస్ట్.. అంతా ఆమె ఇష్టపూర్వకంగానే జరిగిందని నిందితుడికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు

అలహాబాద్ హైకోర్టు రేప్ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. మద్యం సేవించిన యువతి ఇష్టపూర్వకంగానే నిందితుడితో శృంగారంలో పాల్గొందని తేలింది. తర్వాత అతనిపై ఫిర్యాదు చేసింది. సాక్ష్యాలు పరిశీలించిన హైకోర్టు నిందితుడికి బెయిల్ ఇచ్చింది.

New Update
alahabad high court

alahabad high court

అల‌హాబాద్ హైకోర్టు ఓ రేప్ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరీ చేసింది. అత్యాచారానికి గురైన మ‌హిళే.. ఆ స‌మ‌స్యకు కార‌ణ‌మైంద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఆమె స‌మ‌స్యకు ఆమే బాధ్యురాలు అని కోర్టు పేర్కొన్నది. జ‌స్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఆ కేసులో తీర్పును వెలువ‌రించారు. 2024 సెప్టెంబ‌ర్‌లో ఢిల్లీలోని హౌజ్ ఖాస్ బార్‌లో ఓ మ‌హిళ‌కు ఓ వ్యక్తి ప‌రిచ‌యం అయ్యాడు. అయితే ఆ వ్యక్తే త‌న‌ను రేప్‌కు గురి చేసిన‌ట్లు ఆ మ‌హిళ ఫిర్యాదు చేసింది. డిసెంబ‌ర్ 2024లో నిందితుడిని అరెస్టు చేశారు. ఆ కేసులో ఇవాళ అల‌హాబాద్ హైకోర్టు తీర్పుఇచ్చింది. సదరు వ్యక్తి ఆమెను బలాత్కారం చేశాడని సాక్ష్యాలు ఏమీ లేవు. ఫిర్యాదు చేసిన యువతి ఇష్టపూర్వకంగానే అతనితో శ‌ృంగారం చేసిందని నిందితుడు తెలిపాడు. ఆరోజు ఆమె పూర్తిగా మధ్యం మత్తులో ఉందని తెలిపాడు. 

ముగ్గురు మ‌హిళా మిత్రుల‌తో క‌లిసి బార్‌కు వెళ్లిన యూనివ‌ర్సిటీ విద్యార్థిని అక్కడ ఫుల్‌గా తాగింది. మ‌త్తులో ఉన్న ఆమెకు ఓ వ్యక్తి ఆ ప‌బ్‌లో ప‌రిచ‌యం అయ్యాడు. ఆ వ్యక్తే ఈ కేసులో నిందితుడు. తెల్ల‌వారుజామున 3 గంట‌ల వ‌ర‌కు బార్‌లో ఉన్న ఆ వ్యక్తి.. ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. రెస్ట్ తీసుకునేందుకు అత‌ని ఇంటికి వెళ్లినట్లు ఆ మ‌హిళ త‌న ఫిర్యాదులో తెలిపింది. అయితే ఆ వ్యక్తి త‌నను అస‌భ్యక‌రంగా ట‌చ్ చేశాడ‌ని, త‌న ఇంటికి బ‌దులుగా బంధువుల ఇంటికి తీసుకెళ్లి రేప్ చేసిన‌ట్లు ఆమె ఆరోపించింది. నోయిడా పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

Also read: రూ.63కోట్ల స్కామ్ బయటపెట్టిన ఈడీ.. బ్యాంక్ మాజీ చైర్మెన్ అరెస్ట్

బెయిల్ పిటీష‌న్‌లో నిందితుడు ఆ రోజు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను వివ‌రించారు. ఫుల్‌గా తాగిన ఆ మ‌హిళ‌కు స‌పోర్ట్ అవ‌స‌ర‌మైన నేప‌థ్యంలో ఆమెను ఇంటికి తీసుకెళ్లిన‌ట్లు అత‌ను చెప్పాడు. బంధువుల ఇంటికి ఆమెను తీసుకెళ్లిన‌ట్లు చేసిన ఆరోప‌ణ‌ల‌ను అత‌ను కొట్టివేశాడు. తానేమీ రేప్‌కు పాల్ప‌డ‌లేద‌ని, కానీ ఇరువురం ఇష్ట‌పూర్వ‌కంగా శృంగారంలో పాల్గొన్నట్లు చెప్పాడు. కోర్టు ఈ కేసులో తీర్పునిస్తూ.. బాధితురాలు ఓ పీజీ విద్యార్థి అని, ఆమె చ‌ర్యల‌పై ఆమెకు అవ‌గాహ‌న ఉంటుంద‌ని తెలిపింది. కేసు పూర్వోప‌రాలు, ప‌రిస్థితులు, సాక్ష్యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని తీర్పును ఇస్తున్నట్లు జ‌స్టిస్ పేర్కొన్నారు. పిటీష‌న‌ర్ బెయిల్‌కు అర్హుడ‌ని, అందుకే అత‌ని బెయిల్ పిటీష‌న్‌ను ఆమోదిస్తున్నట్లు జ‌స్టిస్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. 

Aslo read: కంచ గచ్చిబౌలి భూవివాదం సెంట్రల్ కమిటీ హైదరాబాద్‌లో వారితో భేటి

Advertisment
Advertisment
Advertisment