నన్న ఓడించింది వాళ్లే.. అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తా: రఘునందన్ సంచలన ఇంటర్వ్యూ

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోలీసులు తనపై కక్ష్య కట్టి ఓడించారని దుబ్బాక మాజీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేతలు పోలీసుల సహకారంతో డబ్బులు పంచి గెలిచారన్నారు. ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు. మెదక్ ఎంపీగా బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు.

New Update
నన్న ఓడించింది వాళ్లే.. అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తా: రఘునందన్ సంచలన ఇంటర్వ్యూ

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా బరిలో ఉంటానని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు (Raghunadan Rao) స్పష్టం చేశారు. ఆర్టీవీతో ఆయన ఈరోజు మాట్లాడుతూ.. నేషన్ ఫస్ట్ పార్టీ నెక్ట్స్ అనే పార్టీలో వ్యక్తి పూజ ఏంటని ప్రశ్నించారు. చేయి ఊపితే గెలుస్తామని చెప్పిన వారు ఎందుకు ఓడిపోయారన్నారు. తాను పార్టీ హైకమాండ్ కు మాత్రమే జవాబుదారీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రఘునందన్ రావు.
ఇది కూడా చదవండి: TS Free Power Scheme : తెలంగాణలో వారికి ఇక ఉచిత కరెంట్.. రూల్స్ ఇవే!

ఇటీవల జరిగిన ఎన్నికల్లో దుబ్బాకలతో తన ఓటమిపై స్పందిస్తూ.. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని అన్నారు. గతంలో తాను మెదక్ ఎంపీగా పోటీ చేసి మంచి ఓటింగ్ శాతం పొందానని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ మెదక్ ఎంపీగా పోటీ చేస్తానన్నారు. ఎన్నికలకు ముందు చివరి మూడు రోజులు పోలీసుల సహకారంతో దుబ్బాకలో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచి గెలిచారని ఆరోపించారు. పోలీసులు తనపై కక్ష్య కట్టి ఓడించారన్నారు. ఈ విషయంపై డీజీపీకి కంప్లైంట్ చేసినట్లు చెప్పారు రఘునందన్.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: ముమ్మాటికి భద్రతా లోపమే.. అమిత్ షా, మోదీ రాజీనామా చేయాలి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

ఉగ్రదాడి ముమ్మాటికి భద్రత లోపమేనని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఫైర్ అయ్యారు. ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
 ys sharmila

ys sharmila

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి మనం దేశం మీద జరిగిన దాడి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిల అన్నారు. దేశంలో శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయని  ప్రధాని మోడీ ఒక క్యాంపెయిన్ నడిపారని.. పెద్ద పెద్ద బోర్డులు పెట్టారని అన్నారు. ఇది చూసి ఏటా 2 కోట్ల మంది కశ్మీర్ కి వెళ్తుంటారన్నారు. ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం ఎందుకు? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి భద్రత లోపమేనని ధ్వజమెత్తారు. టూరిస్టులపై కాల్పులు జరుపుతుంటే ఆర్మీ వాళ్లు లేనే లేరన్నారు. ప్రొటెక్షన్ కోసం ఉండే సెక్యూరిటీ కూడా లేదన్నారు. ఇంతమంది చనిపోయారు అంటే ప్రభుత్వ లోపమేనన్నారు. ఉగ్రవాదం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని అన్నారు. నేడు దేశ నిఘా వ్యవస్థ దేశం కోసం పనిచేయడం లేదన్నారు. ఇండియా ఇంటలిజెన్స్ అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ల మీద పనిచేస్తోందని ఆరోపించారు. 

మోదీకి అధికారంలో ఉండే హక్కు లేదు..

ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లకు అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. వీళ్ళు దేశానికి చౌకిదార్ కాదు..బీజేపీకి చౌకిదార్లని అన్నారు. ఈ దేశ దర్యాప్తు వ్యవస్థలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్నారు. నిఘా వ్యవస్థ బలం అంతా ప్రధాని మోదీ కోసం పని చేస్తోందన్నారు. దేశ భద్రతను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికి కేంద్రం తప్పిదమేనని ఫైర్ అయ్యారు. ఈ ఘటనలో ఒక ముస్లిం కూడా చనిపోయారని.. దేశంలో ఉన్న ముస్లింలను చెడ్డవాళ్ళు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో మతం పేరుతో యుద్ధం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ దేశంలోనే ఇంటర్నల్‌గా భద్రత లేదన్నారు. అన్ని మతాలు సమానం అనే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. మోదీ శ్రమ దేశ భద్రత కోసం పెట్టి ఉంటే బయట వాళ్ళు చొరబడే పరిస్థితి లేదన్నారు.

Advertisment
Advertisment
Advertisment