Lok Sabha Elections 2024 : బీజేపీ మొరాదాబాద్ ఎంపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ కుమార్ కన్నుమూత..!

యూపీలోని మొరాదాబాద్ బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ కుమార్ అనారోగ్యంతో శనివారం మరణించారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు.కున్వర్ సర్వేష్ సింగ్ 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు.

New Update
Lok Sabha Elections 2024 : బీజేపీ మొరాదాబాద్ ఎంపీ అభ్యర్థి  కున్వర్ సర్వేష్ కుమార్ కన్నుమూత..!

BJP :  యూపీ(UP) లోని మొరాదాబాద్ బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేశ్ సింగ్(Kunwar Sarvesh Singh) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ(Delhi) లోని ఎయిమ్స్ చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. శుక్రవారం (ఏప్రిల్ 19) మొరాదాబాద్‌లో లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) ల పోలింగ్ జరగడం గమనార్హం. అనారోగ్యం కారణంగా ఎన్నికల సమయంలో కూడా ప్రచారానికి దూరంగా ఉన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

తొలిసారిగా 1991లో ఠాకూర్ ద్వారా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అప్పటి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో లోకసభ ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఎస్టీ హసన్ చేతిలో ఓడిపోయాడు. ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన ఆయన.. యూపీ రాజకీయ నేతల్లో ఒకరు. ఆయన కుమారుడు కున్వర్ సుశాంత్ సింగ్.. మొరాదాబాద్ లోకసభ స్థానం పరిధిలోని బాధాపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: రేపు హైదరాబాద్ లో మటన్ చికెన్ షాప్స్ బంద్.. రీజన్ ఇదే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment