BRS Party: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి

TG: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

New Update
BRS Party: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి

Gudem Mahipal Reddy joined Congress: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (Gudem Mahipal Reddy), జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ (Gali Anil Kumar) కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళా యాదవ్, తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ లో పలువురు కార్పొరేటర్లు, అనుచరులు చేరారు. తాజాగా గూడెం మహిపాల్ రెడ్డి చేరికతో  బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు