Big C: బిగ్ సి దసరా ధమాకా ఆఫర్లు!

New Update
Big C: బిగ్ సి దసరా ధమాకా ఆఫర్లు!

దిగ్గజ ఈ కామర్స్‌ సంస్థలు అయిన ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్‌ (Amazon) రెండు బిగ్‌ బిలియన్‌ డేస్‌, గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్స్ అంటూ భారీ తగ్గింపు ధరలను ప్రజల ముందుకు తీసుకుని వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రముఖ మొబైల్ ఫోన్ల విక్రయ సంస్థ బిగ్‌ సి (Big C) కూడా వచ్చి చేరింది. ఈ దసరా పండుగ సందర్భంగా ఎన్నో ఆఫర్లతో వచ్చేసింది.

దసరా పండుగను పురస్కరించుకోని వినియోగదారుల కోసం ధమాకా ఆఫర్లను తీసుకువచ్చినట్లు బిగ్‌ సి వ్యవస్థాపకుడు సీఎండీ బాలు చౌదరి తెలిపారు.కొన్ని సెలెక్టెడ్‌ ఫోన్లు కొనుగోలు పై రూ.5 వేలు బోల్డ్‌ స్మార్ట్ వాచీని రూ.299 కే ఆఫర్‌ చేస్తున్నట్లు ఆయన వివరించారు.

అలాగే ఐఫోన్‌ కొనుగోలు రూ. 4 వేల వరకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ని ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అంతేకాకుండా వడ్డీ, డౌన్‌పేమెంట్‌ లేకుండా మొబైల్‌, స్మార్ట్‌ ఫోన్‌, ల్యాప్‌ టాప్‌, ఏసీలను కొనుగోలు చేసే సదుపాయం కూడా ఉందని బాలు తెలిపారు.

ధమాకా ఆఫర్స్‌ లో భాగంగా ఏ స్మార్ట్‌ ఫోన్ కొనుగోలు చేసినా దాని మీద రూ.10 వేల వరకు క్యాష్‌ బ్యాక్‌ తో పాటు రూ.4 వేలు విలువ చేసే బహుమతిని కూడా అందించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా బజాజ్‌ ఫైనాన్స్‌ ద్వారా ఫోన్లను కొంటే రూ.9 వేలు క్యాష్‌ బ్యాక్‌, ఎస్‌బీఐ కార్డు ద్వారా మొబైల్‌, స్మార్ట్‌ టీవీ, ల్యాప్‌ టాప్‌ లు కొనుగోలు చేస్తే రూ. 3 వేల వరకు ఇన్‌ స్టంట్ డిస్కౌంట్‌, ఐసీఐసీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ ను అందించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రతి స్మార్ట్‌ టీవీ కొనుగోలుపై కచ్చితమైన బహుమతితో పాటు రూ.14,999 విలువ గల బోట్‌ స్పీకర్‌ను రూ.5,699కు ఇస్తున్నట్లు తెలిపారు. ఐఫోన్లపై రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్‌, రూ.9,999 విలువైన ఫైర్‌ బోల్ట్‌ స్మార్ట్‌ వాచ్‌ జోడీ ఆఫర్‌ (1+1) కేవలం రూ.1,999కు ఇస్తున్నట్లు వివరించారు. బ్రాండెడ్‌ యాక్సెసరీస్‌పై 51 శాతం వరకు రాయితీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Also read: ఇంద్రకీలాద్రీ పై గాయత్రి దేవిగా దర్శనం ఇస్తున్న అమ్మవారు!

Also read: బ్రహ్మోత్సవాలు రెండో రోజు..ఏ వాహనం పై స్వామివారి దర్శనం అంటే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఆర్బీఐ ఎఫెక్ట్.. ఈ కంపెనీల షేర్లు భారీగా పతనం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల ప్రభావం గోల్డ్ లోన్ కంపెనీలపై భారీగా పడింది. ఆర్బీఐ ప్రకటించిన వెంటనే ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.

New Update
Muthoot finance Shares

Muthoot finance Shares Photograph: (Muthoot finance Shares)

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. అయితే ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో గోల్డ్ లోన్ కంపెనీలపై భారీ ఎఫెక్ట్ పడింది. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు అయితే దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఆర్బీఐ కీలక ప్రకటన చేసిన తర్వాత..

బంగారు ఆభరణాలపై బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీ వంటి నియంత్రిత సంస్థలు గోల్డ్ లోన్లు ఇస్తాయని గవర్నర్ తెలిపారు. అయితే వ్యక్తిగత సంస్థల రిస్క్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోల్డ్ లోన్ నిబంధనలను జారీ చేస్తామని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల గోల్డ్ లోన్ కంపెనీల షేర్లపై ప్రభావం పడింది.

ఇది కూడా చూడండి: Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

ముత్తూట్ ఫైనాన్స్ కోసం బంగారు రుణాలు కంపెనీ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులలో 98 శాతంగా ఉన్నాయి. అదే సమయంలో మణప్పురం ఫైనాన్స్‌లో 50 శాతం, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో 21 శాతం ఏయూఎం గోల్డ్ లోన్స్ నుండి వస్తాయి. ఈ షేర్లు ధరలు 10 శాతం క్షీణించి రూ.2,063 వద్ద ముగిసింది. అదేసమయంలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు ధర 6.66 శాతం క్షీణించి రూ.311.25 వద్ద ముగిసింది. 

Advertisment
Advertisment
Advertisment