Health News: ఇవి తీసుకుంటే.. హైబీపీ, కిడ్నీలో రాళ్ల సమస్యలు దరిచేరవు

ప్రస్తుతం మానవుల జీవనశైలీ పూర్తిగా మారిపోయింది. ఈ బిజీ లైఫ్‌లో ఇంటా బయట ఇష్టమైన ఆహారాన్ని విచ్చలవిడిగా తింటూ అనేక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో కూడా చాలామది అధిక బీపీతో ఇబ్బందులు ఎదుర్కొవడం ఆందోళన కలిగిస్తోంది.

New Update
Health News: ఇవి తీసుకుంటే.. హైబీపీ, కిడ్నీలో రాళ్ల సమస్యలు దరిచేరవు

మానవుల జీవనశైలి మారిపోవడంతో చాలా మంది.. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలకి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో చాలామది అధిక బీపీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక రక్తపోటు అనేది శరీరంలో గుండె సమస్యలను పెంచుతుంది. కానీ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఈ సమస్యను నియంత్రించవచ్చు. హైబీపీతో బాధపడుతున్నట్లయితే ఎక్కువ ఉప్పు, తీపి, కొవ్వు ఉన్నటువంటి పదార్థాలను తినకూడదు. ఇలాంటివి తింటే రక్తపోటు పెరుగిపోతుంది. ఆహారంలో కొన్ని పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చేర్చినట్లయితే రక్తపోటును నియంత్రించవచ్చు. అయితే ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.

1. గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు అనేవి ఉంటాయి. వీటిని తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచేలా చేస్తాయి. అలాగే ఫ్యాటీ ఫిష్‌ తినడం వల్ల కూడా హైబీపీ నియంత్రణలో ఉంటుంది. చేపలలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి మన హృదయాన్ని ఫిట్‌గా ఉంచడంతో పాటు.. రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడతాయి.

2. ఇప్పుడు ప్రజల్లో మారిన జీవనశైలి వల్ల చాలామందికి కిడ్నీలలో రాళ్లు ఏర్పడుతున్నాయి. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే.. తులసి ఆకుల రసాన్ని తీసి దానికి ఒక చెంచా తేనె కలిపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం పూట తీసుకోవాలి. ఇలా చేస్తే కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు కిడ్నీలో రాళ్లను తొలగించేందుకు టొమాటో రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా రెండు టమోటాలు బాగా కడిగి వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ జ్యూస్‌లో ఉప్పు, మిరియాల పొడి కలుపుకుని తాగాలి. అలాగే ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి జ్యూస్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు.

3. ఇక నిమ్మకాయలో సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది కూడా కిడ్నీలోని రాళ్లను తొలగించడంలో చక్కగా పనిచేస్తుంది. పెరుగును ఒక గిన్నెలో తీసుకుని అందులో చెంచా నిమ్మరసం వేసి రుచికి తగినట్లుగా ఉప్పు వేయాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

Also Read: మంచి ఆహారం ఆరోగ్యానికి పరమౌషధం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలో ముగించుకున్నారు. వెంటనే ప్రత్యేక విమానంలో ఆయన హుటాహుటిన బయలుదేరి ఈరోజు ఉదయానికి ఢిల్లీ చేరుకున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
PM Modi

PM Modi

జమ్మూలోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి మొత్తం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కంటి మీద కునుకును దూరం చేసింది. చనిపోయిన వారి బంధువులతో పాటూ అందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ దాడిపై ఇప్పటికే ప్రధాని మోదీ, రాష్ట్రపతి మరికొందరు స్పందించారు. దాడిలో మృతి చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసుకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.  

అత్యవసర క్యాబినెట్ సమావేశం..

మరోవైపు ప్రధాని మోదీ తన సౌదీ పర్యటనను మధ్యలో ముగించుకుని తిరిగి వచ్చేశారు. ప్రత్యేక విమానంలో ఆయన హుటాహుటిన బయలుదేరి...ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీతో భేటీ అయి ఘటన గురించి చర్చించారు. దాడి తీరును వారు ప్రధానికి వివరించారు. దాంతో పాటూ మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ  అత్యవసరంగా సమావేశం కానుంది. బైసరన్ లోయలో పర్యాటకుల మీద జరిగిన దాడి గురించి చర్చించనున్నారు. దీంట్లో తదుపరి తీసుకోవాల్సిన చర్యల మీద నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రధాని మోదీ జమ్మూ వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్లు చెబుతున్నారు.  మరోవైపు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్‌కు చేరుకున్నారు. అక్కడ భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. మరి కాసేపట్లో పహల్గామ్ లో దాడి జరిగిన చోటికి అమిత్ షా వెళ్ళనున్నారు. 

today-latest-news-in-telugu | pm-modi | cabinet-meeting | soudi-arebia

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

Advertisment
Advertisment
Advertisment