Beauty Tips: పంచదారతో చేసిన ఈ స్క్రబ్‌ ముఖాన్ని రష్మిక లాగా మెరిసేలా చేస్తుంది!

ఇటీవలి కాలంలో పొలూష్యన్‌ కారణంగా చాలామంది ముఖాలు డల్‌గా మారిపోతున్నాయి. బయట ప్రొడక్ట్స్‌తో కంటే ఇంటి చిట్కాలతోనే స్కిన్‌ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా పంచదారతో అనేక చర్మ సమ్యలకు చెక్‌ పెట్టవచ్చు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Beauty Tips: పంచదారతో చేసిన ఈ స్క్రబ్‌ ముఖాన్ని రష్మిక లాగా మెరిసేలా చేస్తుంది!

బిజీ లైఫ్ స్టైల్ వల్ల మనుషుల చర్మం చాలా డల్‌గా మారుతుంది. ఇక మారుతున్న సీజన్‌లో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.లేకపోతే చర్మం చాలా పొడిబారి నీరసంగా మారడం మొదలవుతుంది. చాలా మంది ముఖాన్ని కాంతివంతం చేయడానికి అన్ని రకాల ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు, అయితే వాటి ప్రభావం ఎక్కువసేపు కనిపించదు. ఈ ఉత్పత్తులలో ఉండే పదార్థాలు కొన్నిసార్లు చర్మానికి ప్రయోజనం చేకూర్చకుండా హాని చేస్తాయి. అందుకే ఈ రోజు మేము మీకు ఓ ఇంటి చిట్కా చెప్పబోతున్నాం. ఇంట్లో పంచదారతో కొన్ని ప్రత్యేక స్క్రబ్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది మీ చర్మాన్ని మెరిసిపోయేలా చేస్తుంది.

--> నిమ్మ చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను తొలగిస్తుంది. నిమ్మ-పంచదారతో స్క్రబ్ తయారు చేయవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో పంచదార తీసుకుని నిమ్మరసం కలుపుకుంటే సరిపోతుంది. అందులో కొద్దిగా తేనె కూడా కలపాలి. ఇప్పుడు ఈ ప్యాక్ తో ముఖానికి మసాజ్ చేసి కాసేపటి తర్వాత నీటితో ముఖం కడుక్కోవాలి.

--> గ్రీన్ టీలో ఉండే అన్ని రకాల ఎలిమెంట్స్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. దీని సహాయంతో స్క్రబ్ తయారు చేసుకుంటే ముఖంపై మొటిమల సమస్య కూడా తొలగిపోతుంది. ఒక చిన్న గిన్నెలో గ్రీన్ టీని తీసుకొని, అందులో ఒక టీస్పూన్ చక్కెర కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్ తో ముఖానికి మసాజ్ చేసి కాసేపటి తర్వాత ముఖం కడుక్కోవాలి.

--> పసుపు అనేక చర్మ సమస్యలను తొలగించడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకుని అందులో ఒక టీస్పూన్ తేనె, పంచదార కలపాలి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి ముఖానికి బాగా స్క్రబ్ చేయాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

--> టమోటా -పంచదార స్క్రబ్స్ కూడా చర్మాన్ని అందంగా మెరిసేలా చేస్తుంది. దీన్ని తయారు చేసుకోవాలంటే టమోటాను సగానికి కట్ చేసి దాని పైన పంచదార వేసి స్క్రబ్ చేయాలి. తేలికపాటి చేతితో స్క్రబ్ చేసిన తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి.

Also Read: రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్నారా? డాక్టర్ చెప్పే ఈ చిట్కాలు పాటించండి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raj Tarun: ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన యంగ్ హీరో..

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్'తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా టీజర్ విడుదలై ప్రమోషన్స్ షురూ అయ్యాయి. గత వివాదాల తర్వాత పెద్దగా కనిపించలేదు రాజ్, తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. 

New Update
Raj Tarun

Raj Tarun

Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ గురించి చెప్పాలంటే, అతని స్టైల్ కొంచెం ప్రత్యేకమే. కేవలం సినిమా ప్రమోషనన్స్ టైమ్ లో మాత్రమే కనిపించి, తర్వాత పూర్తిగా మాయమవ్వడం అతని అలవాటుగా కనిపిస్తోంది. మూవీ రిలీజ్ టైమ్ లో తప్ప మిగతా రోజుల్లో  ఏమాత్రం అప్‌డేట్స్ లేకుండా మాయమయిపోతుంటాడు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రాజ్ తరుణ్ లాగానే అతని సినిమాలు కూడా అంతే త్వరగా మాయమవుతాయి. ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాడో, టైటిల్ ఏంటి, ఎప్పుడు విడుదలవుతుందో ఇవేమి ఎవరికీ తేలేదు. సడన్ గా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంటాడు.

‘పాంచ్ మినార్’ ప్రమోషన్స్..

అయితే ఈ సారి కూడా అదే జరిగింది,  రాజ్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చాడు. ‘పాంచ్ మినార్’(Paanch Minar) అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. చిత్ర బృందం టీజర్‌ను లాంచ్ చేసింది. ఇకపై సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను వరుసగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విడుదల కూడా త్వరలోనే ఉండబోతుందట.

Also Read: ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!

ఇదంతా పక్కనపెడితే, గతంలో రాజ్ తరుణ్ పై వచ్చిన వ్యక్తిగత వివాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. లావణ్య అనే మహిళ రాజ్ తరుణ్ తన భర్త అని మీడియా ముందుకొచ్చి సంచలనం సృష్టించింది. ఆ వివాదం పెద్ద చర్చకు దారితీసినా, చివరికి ఆమెనే మళ్లీ అతనికి క్షమాపణలు చెప్పింది. తన ఆరోపణలకు తానే క్లారిటీ ఇవ్వడంతో, రాజ్ తరుణ్ తిరిగి తెరపైకి వస్తాడని అందరూ భావించారు.

Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..

అయితే ఆ వివాదం సద్దుమణిగాక  కూడా రాజ్ తరుణ్ మాత్రం మౌనం వీడలేదు, కావాలనే అజ్ఞాతం లోకి వెళ్ళాడో, లేదంటే ప్లాన్డ్ సైలెన్స్‌లో ఉన్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇప్పుడు మరోసారి సినిమా విడుదల దశకు చేరుకోవడంతో మీడియా ముందుకొచ్చిన రాజ్ తరుణ్, సినిమా ప్రమోషన్స్ ముగిసిన తర్వాత మళ్లీ మాయమవుతాడా? అన్నది ప్రెశ్నగా మారింది.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

Advertisment
Advertisment
Advertisment