గంజాయి మత్తులో..ఆరేళ్ల బాలుడి పై లైంగిక దాడి! గంజాయికి అలవాటు పడిన ఓ యువకుడు ఆ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు. ఆరేళ్ల బాలుడితో నీచంగా ప్రవర్తించి గ్రామస్థుల చేతిలో తన్నులు తిన్నాడు. By Bhavana 12 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి గంజాయికి అలవాటు పడిన ఓ యువకుడు ఆ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు. ఆరేళ్ల బాలుడితో నీచంగా ప్రవర్తించి గ్రామస్థుల చేతిలో తన్నులు తిన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలోని పొన్నూరు పట్టణానికి చెందిన ఓ ఆరేళ్ల బాలుడు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం కూడా పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చిన బాలుడు ఇంటి పరిసరాల్లో స్నేహితులతో కలసి ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అక్కడికి 20 ఏళ్ల నాగిశెట్టి పవన్ సంజయ్ అనే వ్యక్తి వచ్చాడు. ఆ సమయంలో అతను పూర్తిగా గంజాయి మత్తులో ఉన్నాడు. దాంతో బాలుడిని చూసిన తరువాత అతడికి ఏం చేస్తున్నాడో తెలియని స్థితికి చేరుకున్నాడు. ఓ ఇంట్లోకి బాలుడిని లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలుడు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. బాలుడు గట్టిగా అరవడంతో తలుపులు పగలగొట్టి నిందితుడిని బయటకు తీసుకుని వచ్చి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని హాస్పిటల్ కు తీసుకెళ్లి, నిందితుడిపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. #gunturu #andhrapradesh #boy #sexually-harrased #young-man సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి