APPSC Group-2: ఏపీలో గ్రూప్-2 పరీక్ష వాయిదా! ఏపీలో ఈ నెల 28న జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. పరిపాలన కారణాలతోనే గ్రూప్-2 పరీక్షను ఏపీపీఎస్సీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. By Nikhil 03 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి APPSC Group 2 Postponed: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ (Group 2 Mains) పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు వెబ్ నోట్లో పేర్కొంది. ఏపీలో 897 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ గతేడాది డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్, మరో 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షను ఈ ఏడాది ఫిబ్రవరి 25న నిర్వహించారు. ఫలితాలను ఏప్రిల్ 2వ వారంలో విడుదల చేసింది ఏపీపీఎస్సీ. జులై 28న మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. తాజాగా పరీక్షను వాయిదా వేస్తున్నట్లు వెబ్ నోట్ విడుదల చేసింది. ఇటీవల ప్రభుత్వం మారిన నేపథ్యంలో పరిపాలన కారణాలతో ఈ పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థులు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలకు సంబంధించిన అప్డేట్స్ ను https://portal-psc.ap.gov.in/ వెబ్ సైట్లో తెలుసుకోవచ్చని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. #appsc-group-2 #chandrababu-naidu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి