AP, TS Floods: ఏపీ, తెలంగాణ వరద బాధితులకు సినీ తారల సహాయం..!

భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఆహరం లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలెబ్రెటీలు విపత్తు బాధితులకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. హీరో NTR, సిద్దు, విశ్వక్ తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటించారు.

New Update
AP, TS Floods: ఏపీ, తెలంగాణ వరద బాధితులకు సినీ తారల సహాయం..!

AP, TS Floods: గత నాలుగు రోజులుగా భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వరద నీటి ప్రభావం ఎక్కువ కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. అక్కడి ప్రజలు తినడానికి తిండి, నీరు, నివాసం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఈ విపత్తు నేపథ్యంలో పలువురు సినీ తారలు, ప్రముఖులు రెండు రాష్ట్రాల బాధితులకు సాయం చేందుకు ముందుకు వస్తున్నారు. తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రూ. కోటి, నందమూరి బాలకృష్ణ రూ. కోటి, మహేష్ బాబు రూ. కోటి, పవన్ కళ్యాణ్ రూ. కోటి, విశ్వక్ సేన్ రూ. 10 లక్షలు, సిద్దు జొన్నలగడ్డ రూ. 30 లక్షలు, వైజయంతి రూ. 25లక్షలు, హాసిని హారిక ఎంటర్ టైన్మెంట్స్ రూ. 50 లక్షల విరాళాలు ప్రకటించారు.

Also Read: NTR: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు NTR రూ. కోటి విరాళం..! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు