Vizag Accident : ప్రాణ తీసిన అతివేగం.. ఇద్దరు స్పాట్ డెడ్: సీసీ టీవీ దృశ్యాలు

విశాఖలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. మరో యువకుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

New Update
Vizag Accident : ప్రాణ తీసిన అతివేగం.. ఇద్దరు స్పాట్ డెడ్: సీసీ టీవీ దృశ్యాలు

Elections 2024 : ఎన్నికల వేళ విశాఖ(Visakha)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. ఎన్ఏడీ కొత్తరోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జి పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఒకరికి సీరియస్ గా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి పూట.. డ్యూక్ బైక్ పై ముగ్గురు యువకులు ఫ్లైఓవర్ పై వస్తున్నారు. అతివేగంగా వచ్చిన వీరి బైక్ అదుపుతప్పి ఫ్లైఓవర్ వాల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో కేజీహెచ్ కు తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు(Airport Zone Police) దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తే స్పష్టం అవుతోంది.

Also Read : ఏపీలో రేపే ఎన్నికల సమరం.. ఏర్పాట్లు ఎలా చేస్తున్నారంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు