Lokesh pawan: జేఏసీ సమావేశంలో 3 తీర్మానాలు.. కరువు-జగన్ కవలపిల్లలు!

2024లో వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనన్నారు నారా లోకేశ్‌. రాజమండ్రి వేదికగా చారిత్మాత్మక జేఏసీ సమావేశం జరిగిందన్నారు. ప్రజాసమస్యలపైనే ఉమ్మడి సమావేశంలో పవన్‌తో కలిసి చర్చించామన్నారు. నవంబర్ 1 నుంచి ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళతాం అన్నారు లోకేశ్‌.

New Update
Lokesh pawan: జేఏసీ సమావేశంలో 3 తీర్మానాలు.. కరువు-జగన్ కవలపిల్లలు!

విజయదశమి రోజున టీడీపీ-జనసేన కలయిక రాష్ట్రానికి మేలుచేసే కలయిక అన్నారు టీడీపీ నేత నారా లోకేశ్‌. 2014లో నవ్యాంద్రకు రాజధానిలేదు, సమర్థవంతమైన నాయకుడు కావాలని ఆనాడు పవన్ తమకు మద్దతు తెలిపారన్నారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకోసమే కలసి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం మంజీరా హోటల్‌లో టీడీపీ-జనసేన జేఏసీ తొలి సమావేశం తర్వాత లోకేశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న 100 రోజుల్లో ఎలా కలసి ముందుకెళ్లాలనే విషయమై ఉమ్మడి కార్యాచరణపై చర్చించినట్లు చెప్పారు. నాలుగున్నర సంవత్సరాలుగా సామాజిక అన్యాయం జరుగుతోందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయని చెప్పారు.

తన అక్కను వేధిస్తున్న వాడిని ప్రశ్నించినందుకు అమర్నాథ్ గౌడ్ అనే కుర్రాడిని వైసీపీ నాయకుడు కొడుకు పెట్రోలు పోసి తగులబెట్టారన్నారు. బీసీ సంక్షేమ పథకాలు రద్దు చేయడంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 10శాతం రిజర్వేషన్ ను వైసిపి ప్రభుత్వం రద్దుచేసిందన్నారు. డాక్టర్ సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం వరకు ఎందరో దళితులను వెంటాడి చంపారని తెలిపారు. దళితులకు రావాల్సిన 27సంక్షేమ పథకాలు కూడా ఈ ప్రభుత్వం రద్దుచేసిందన్నారు. ఇస్లాంలో ఆత్మహత్య మహా పాపం, నంద్యాలలో అబ్దులో సలాంను వైసిపి నేతలు వేధించడంతో వారి కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు లోకేశ్‌. పలమనేరులో మిస్బా అనే బాలిక వైసిపి నాయకుడి వత్తిడితో ఆత్మహత్య చేసుకుందని చెప్పారు.

publive-image

కరువు-జగన్ కవలపిల్లలు:
లోకేశ్‌ ప్రేస్‌ నోట్‌ యదాతథంగా:

'కరువు, జగన్ కవలపిల్లలు, రాష్ట్రంలో 34లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల సాగునీటి ప్రాజెక్టులు గాలికొదిలేశారు, మిగులు జలాలు సముద్రం పాల్జేశారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ లేదు, కాల్వల్లో నాచు తీసే పరిస్థితి లేదు. రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. జగన్ అసమర్థ పాలన కారణంగా రైతు ఆత్మహత్యల్లో ఎపి 3వ స్థానం, కౌలు రైతుల్లో 2వస్థానంలో ఉంది. కరెంటుబిల్లు, ఇంటిపన్నుల పెంపుతో వైసిపి ప్రభుత్వం పెద్దఎత్తున ప్రజలపై భారం మోపింది.

గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు, 2.3లక్షల పోస్టులు భర్తీచేస్తామని ఒక్క పోస్టుకూడా భర్తీచేయలేదు. ఉద్యోగాలు, ఉపాధి లేక పక్కరాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితి నెలకొంది. తీవ్రకరువు పరిస్థితుల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు, టిడిపి-జనసేన నేతలు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితి తెలుసుకుని దీనిపై భవిష్యత్ కార్యాచరణ చేపడతాం.'

publive-image

వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు!
'నాలుగున్నరేళ్లుగా ప్రజల సమస్యలపై పోరాడిన వారిపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వేధిస్తున్నారు, అచ్చెన్నాయుడిని ఎలా హింసపెట్టారో అంతా చూశారు. ఏ తప్పుచేయని చంద్రబాబునాయుడును 44రోజజులుగా జైలులో పెట్టారు, ఈ కేసులో 36రోజులకు మించి ఎవరూ రిమాండ్లో లేరు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మంగళగిరి రావడానికి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ల్యాండ్ కానీయలేదు, 3గంటలు బార్డర్ లో ఆపేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినవారి గొంతునొక్కాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజల తరపున పోరాడటానికి, సమస్యల పరిష్కారానికే టిడిపి-జనసేన జెఎసి ఏర్పాటైంది. జెఎసి తొలి సమావేశంలో వందరోజుల కార్యాచరణపై చర్చించాం, ఈనెల 29,30,31 తేదీల్లో టిడిపి-జనసేన నాయకులతో జిల్లాస్థాయిల్లో ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించుకొని నవంబర్ 1నుంచి డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం.

publive-image
ఇది ఖచ్చితంగా చారిత్రాత్మక సమావేశమే!'

రాజమండ్రిలో నిర్వహించిన తొలి జెఎసి సమావేశంలో 3తీర్మానాలు చేశాం.
1). టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ తీర్మానం.
2). అరాచకపాలననుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నిర్ణయం.
3). అన్నివర్గాలను అభివృద్ధిబాటలో నడిపించాలి. తొలి సమావేశం పవన్ చెప్పినట్లు ఒక చారిత్రాత్మక కలయికే, 'నాకు ఎలాంటి సందేహం లేదు... 2024లో టిడిపి-జనసేన కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం. ఏపీకి మంచిరోజులు తీసుకొచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. సమావేశంలో ప్రజల సమస్యల గురించి చర్చించాం, రాష్ట్రప్రజలకు ఏం మేలు చేయాలో, రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించాం. జిల్లాస్థాయిల్లో నిర్వహించే సమావేశాల్లో ఏమైనా సమస్యలుంటే పరిష్కరిస్తాం. ఈనెల 26న తుది ఓటరు లిస్టు వస్తుంది, ఇంటింటికీ వెళ్లి పరిశీలిస్తాం. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి, అప్పుల చేసి సంక్షేమం చేయడం కాదు, అభివృద్ధి చేసి సంక్షేమం చేయాలన్నదే మా లక్ష్యం. ఆ లక్ష్యసాధన కోసం మేం కృషిచేస్తాం.'

Also Read: కష్టపడి గెలిపిస్తే.. నన్ను కోదాడ ఎమ్మెల్యే ఏం చేశాడో తెలుసా?: చందర్ రావు ఇంటర్వ్యూ

Advertisment
Advertisment
తాజా కథనాలు