AP Game Changer : రాజమండ్రిలో పురందేశ్వరి గెలుపు పక్కా? ఆర్టీవీ స్టడీలో సంచలన రిజల్ట్!
ఏపీలో రాజమండ్రి పార్లమెంట్ సీటు అత్యంత కీలకమైంది. ఇక్కడ బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా పురందేశ్వరి, వైసీపీ నుంచి గూడూరి శ్రీనివాసరావు పోటీ పడుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఊహించినంత టఫ్ ఫైట్ లేకపోయినా ఆర్టీవీ స్టడీలో ఆసక్తికర రిజల్ట్ వెల్లడైంది.
Rajahmundry : ఏపీలో రాజమండ్రి పార్లమెంట్ సీటు(Parliament Seat) అత్యంత కీలకమైంది. ఇక్కడ బీజేపీ(BJP) నుంచి కూటమి అభ్యర్థిగా పురందేశ్వరి, వైసీపీ నుంచి గూడూరి శ్రీనివాసరావు పోటీ పడుతున్నారు.
గూడూరి శ్రీనివాసరావు మొదటిసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో బీసీల ప్రభావం ఎక్కువ కావడం ఆయనకు అదనపు బలం. అయితే పార్టీపై వ్యతిరేకత, సొంత ఇమేజ్ లేకపోవడం మైనస్. కూటమి అభ్యర్థి పురందేశ్వరికి ఎన్టీఆర్ కుమార్తెగా గుర్తింపు ఉంది. కేంద్ర మాజీమంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిసొస్తోంది. నాన్లోకల్ కావడం ఒక్కటే ఇబ్బందిగా మారింది.
ఓవరాల్గా రాజమండ్రి పార్లమెంట్లో పురందేశ్వరికే విజయావకాశాలు ఉన్నాయని ఆర్టీవీ స్టడీ(RTV Study) లో తేలింది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.
Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ
అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.
అఘోరీ, శ్రీవర్షిణీ లవ్కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది.
అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్ని కాదని.. మేజర్నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.
ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.
aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news