APPSC Group-1 : ఏపీలో గ్రూప్-1 రద్దుపై తాత్కాలిక స్టే

ఏపీలో గ్రూప్-1 పరీక్ష రద్దు విషయంలో ఏపీపీఎస్సీకి హైకోర్టులో ఊరట లభించింది. పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో ఏపీపీఎస్సీ సవాల్ చేసింది. దీనిపై విచారణ నిర్వహించిన డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది.

New Update
AP Group-1: ఏపీ గ్రూప్-1లో అవకతవకలు? వెలుగులోకి  సంచలన విషయాలు!

APPSC : ఏపీలో గ్రూప్-1 పరీక్ష రద్దు విషయంలో ఏపీపీఎస్సీకి(APPSC) హైకోర్టు(High Court) లో ఊరట లభించింది. పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో ఏపీపీఎస్సీ సవాల్ చేసింది. దీనిపై విచారణ నిర్వహించిన డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న వారు కొనసాగుతారని స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు.
ఇది కూడా చదవండి: Volunteers Suspended: కడపలో 11 మంది వాలంటీర్లు సస్పెండ్

దీంతో ఆ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వారంతా ఉద్యోగాలు కోల్పోవాలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ లో అప్పీలుకు వెళ్లింది. ఈ పటిషన్ పై ఈ రోజు విచారణ నిర్వహించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. విచారణను వారం పాటు వాయిదా వేసింది.

అసలేమైందంటే?
2018 గ్రూప్-1 నోటిఫికేషన్(2018 Group-1 Notification) కు సంబంధించి జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం), డిజిటల్ విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారని.. మొదటిసారి దిద్దిన ఫలితాలను దాచి పెట్టి.. రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు(APPSC Results) ప్రకటించిందని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వారు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మార్చి 13న సంచలన తీర్పు ఇచ్చింది. ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరో 6 నెలల్లో మెయిన్ ను మళ్లీ‌ నిర్వహించాలని ఆదేశించింది.

అయితే.. ఆ సమయంలోనే ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగాలు సాధించి విధులు నిర్వర్తిస్తున్న వారు ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రభుత్వం కోరింది.  ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటన మేరకు ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ కు అప్పీలుకు వెళ్లింది. ఈ మేరకు ఈ రోజు విచారణ జరిగింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Crime: ఓరి పాపిస్టోడా.. రూ.5 కోసం ముసలవ్వను కొట్టి కొట్టి చంపేశావ్ కదరా!

అన్నమయ్య జిల్లాలో శనివారం దారుణం జరిగింది. రూ.5 కోసం జరిగిన వివాదం వృద్ధురాలిని బలిగొంది. ఆటో ఎక్కిన గంగులమ్మ (70) తనకు రావాల్సిన రూ.5 తిరిగి అడిగింది. డ్రైవర్ ఇవ్వకపోవడంతో తిట్టింది. కోపగ్రస్తుడైన డ్రైవర్ ఆమెను కొట్టి కొట్టి చంపేశాడు.

New Update
Annamayya Madanapalle woman died after being attacked by an auto driver

Annamayya Madanapalle woman died after being attacked by an auto driver

ఏపీలో దారుణమైన ఘటన జరిగింది. 70 ఏళ్ల ముసలవ్వకు, ఆటో డ్రైవర్‌కు మధ్య రూ.5 కోసం జరిగిన వాగ్వాదం ఒకరి చావుకి కారణమైంది. ఆటో డ్రైవర్ రూ.5 ఎక్కువ తీసుకున్నాడని.. ముసలవ్వ నోరు పారేసుకుంది. అది సహించుకోలేని ఆటో డ్రైవర్.. ఏకంగా ఆమెను కానరాని లోకాలకు పంపించేశాడు. ఆ వృద్ధురాలిని కొట్టి కొట్టి చంపేసి రోడ్డుపై పడేశాడు. రన్నింగ్ ఆటోలోంచి కింద పడిపోయినట్లు కథ అల్లాడు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

రూ.5 గొడవకు ప్రాణం బలి

రూరల్ ఎస్సై గాయత్రి ప్రకారం.. రెడ్డెప్ప, గంగులమ్మ (70) దంపతులు. వీరు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం, చంద్రాకాలనీలో ఉంటున్నారు. గాజులు, బొమ్మలను జాతరలో అమ్ముతూ జీవిస్తున్నారు. రెండు రోజుల క్రితం (శుక్రవారం) రాత్రి గంగులమ్మ అక్క లక్ష్మీ దేవి కుమారుడు వెంకటరమణ నీటితొట్టెలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకెళ్లారు. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

దీంతో ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరమని గంగులమ్మ రూ.2 లక్షలు తీసుకుని బయల్దేరింది. ఇందులో భాగంగానే విష్ణు అనే వ్యక్తి షేర్ ఆటో ఎక్కింది. సీఎస్‌ఐ చర్చి వద్ద ఆమె దిగి ఆటో డ్రైవర్‌కు రూ.20 ఇచ్చింది. తిరిగి తనకు రూ.5 వస్తాయని అడిగింది. ఆ ఆటో డ్రైవర్ ఇవ్వకపోవడంతో ముసలవ్వ అతడ్ని తిడుతూ మళ్లీ ఆటో ఎక్కింది. అయితే తనను తిట్టడం అవమానంగా భావించిన ఆ ఆటోడ్రైవర్ బసినికొండ పంచాయతీలోని రామాచార్లపల్లె సమీపంలోకి తీసుకెళ్లి కొట్టి కొట్టి చంపేశాడు. 

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

ఆపై రోడ్డుపై పడేసి.. రన్నింగ్ ఆటోలోంచి దూకి చనిపోయినట్లు కథ అల్లాడు. ఇక ఈ విషయం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన శైలిలో ఆటో డ్రైవర్ విష్ణు విచారించడంతో అసలు నిజం బయటపడింది. అయితే ప్రస్తుతం గంగులమ్మ తీసుకెళ్లిన రూ.2 లక్షలు ఏమయ్యాయి అనే విషయంపై విచారిస్తు్న్నామని ఎస్ ఐ గాయత్రి తెలిపారు. 

(crime news | murder | latest-telugu-news | telugu-news | AP Crime | ap-crime-news)

Advertisment
Advertisment
Advertisment