YS Sharmila: Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి... షర్మిల సంచలన వ్యాఖ్యలు

YSRCP పార్టీకి కొత్త పేరు పెట్టారు ఏపీ చీఫ్ షర్మిల. వైసీపీలో వైఎస్సార్ లేరని.. Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి అని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టనీ పార్టీ వైసీపీ అని ఫైర్ అయ్యారు.

New Update
YS Sharmila: Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి... షర్మిల సంచలన వ్యాఖ్యలు

AP Congress Chief Sharmila: ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ పై మరోసారి విమర్శల దాడికి దిగారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఏపీలో ఇప్పుడు ఉన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో పెట్టిన YSR కాంగ్రెస్ పార్టీ కాదని... Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి అని చురకలు అంటించారు. ఈ పార్టీలో వైఎస్సార్ లేడు అని పేర్కొన్నారు. మీది జగన్ రెడ్డి పార్టీ.. నియంత పార్టీ... ప్రజలను పట్టించుకోని పార్టీ అని మండిపడ్డారు. ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ అని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టనీ పార్టీ అని ఫైర్ అయ్యారు.

ALSO READ: టికెట్ చిచ్చు.. జేసీ దివాకర్‌రెడ్డికి చంద్రబాబు షాక్?

నాపై దాడి చేస్తున్నారు...

తనపై వైసీపీ పార్టీ నేతలు అన్నివైపుల నుంచి దాడి చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల. తన సొంత వాళ్ళు అనుకొని 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని అన్నారు. తన బిడ్డలను ఇంటిని పక్కన పెట్టా.. వైసీపీ పార్టీని తన బుజాల మీద వేసుకున్నానని భావోద్వేగానికి గురైయ్యారు. వైసీపీ కోసం తన రక్తం దార పోసినట్లు పేర్కొన్నారు. అదే వైసీపీ ఇప్పుడు తన మీద దాడి చేస్తుందని అన్నారు.

నేను వైఎస్సార్ బిడ్డని...

వైసీపీ పార్టీ నేతలు తనపై ఎన్ని దాడులు చేసిన భయపడేది లేదని.. తాను వైఎస్సార్ బిడ్డనని అన్నారు షర్మిల. మీకు చేతనయ్యింది చేసుకోండి అంటూ సవాల్ విసిరారు. తాను అన్నిటికి రెడీ అని స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి హోదా రావాలి, ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం కావాలి.. విశాఖ స్టీల్ ఉండాలి.. ఉద్యోగాలు రావాలి.. రైతు రాజ్యం రావాలి.. అందుకే వైఎస్సార్ బిడ్డ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టిందని షర్మిల వ్యాఖ్యానించారు.

ALSO READ: రేపు అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు

DO WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Inter Supplementary Exams : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపునకు తుది గడువు ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  

New Update
Inter Supplementary Exams

Inter Supplementary Exams

Inter Supplementary Exams:  ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. కాగా ఇంటర్‌ ఫలితాల్లో గణనీయమైన ఉత్తీర్ణత సాధించింది. గతం కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు ఆధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  


 Also Read :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
 
మే 12 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా ఫేయిలై విద్యార్థులు సబ్జెక్టులను బట్టి  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది. ఏప్రిల్ 22 వరకు చివరి తేదీగా ప్రకటించింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనున్నాయి.  

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!


ఈరోజు (శనివారం) ఉదయం సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేష్  ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి అత్యధికంగా పాస్‌ పర్సంటేజ్ నమోదు అవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ప్రతీఏడు లాగే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికదే పై చేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 71 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 64 శాతం ఉత్తీర్ణత పొందారు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో బాలికలు ఉత్తీర్ణత పొందగా.. బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read :  అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో

Advertisment
Advertisment
Advertisment