AP 10th Result : ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. ఎంతమంది పాస్ అయ్యారంటే!

ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడులయ్యాయి. ఈ రిజల్ట్స్ ను విజయవాడలో విద్యా శాఖ కమీషనర్ సురేష్‌కుమార్‌ విడుదల చేశారు. బాలికలు 89.17, బాలురు 84.32 మొత్తంగా 86.69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రిజల్ట్స్ కోసం లింక్ https://www.bse.ap.gov.in/

New Update
NEET Results : నీట్‌ రీ ఎగ్జామ్ రిజల్ట్స్​ విడుదల​..!

AP : ఏపీ(Andhra Pradesh) పదో తరగతి పరీక్ష ఫలితాలు(10th Class Exam Results) విడులయ్యాయి. ఈ రిజల్ట్స్ ను విజయవాడ(Vijayawada) లో విద్యా శాఖ కమీషనర్ సురేష్‌కుమార్‌ విడుదల చేశారు. 84.32 బాలురు, బాలికలు 89.17 శాతం ఉత్తర్ణులైనట్లు తెలిపారు. మొత్తంగా 86.69 శాతం పాస్ అయ్యారు. అసలే పాస్ కానీ స్కూల్స్ 17 ఉండగా.. 2300 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌ లేదా మనబడి వెబ్‌సైట్‌ లోనూ ఏపీ ఎస్‌ఎస్‌సీ రిజల్ట్స్ చెక్‌ చేసుకోవచ్చు.

ఈ ఏడాది రికార్డుస్ధాయిలో..
ఇక ఏపీలో మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలు జరిగిన విష‌యం తెలిసిందే. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో ఈ పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ సంవత్సరం రికార్డుస్ధాయిలో కేవ‌లం 22 రోజుల్లోనే ఏపీ ఎస్‌ఎస్‌సీ రిజల్ట్స్‌ (AP SSC Results) 2024 ప్రకటిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఇక పరీక్షలు రాసిన వారిలో బాలురు 3,17,939, ఉండగా బాలికలు 3,05,153 ఉంది హాజరయ్యారు. https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌ లేదా మనబడి వెబ్‌సైట్‌ నుంచి కూడా ఏపీ ఎస్‌ఎస్‌సీ రిజల్స్‌ చెక్‌ చేసుకోవచ్చు.

Also Read : గాజాపై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడి.. 22మంది మృతి!

Advertisment
Advertisment
తాజా కథనాలు