SOWMYA SHETTY : నటి సౌమ్య శెట్టిపై మరో కేసు.. తండ్రి ఫిర్యాదుతో!

నటి సౌమ్య శెట్టిపై మరో కేసు నమోదైంది. బంగారం దొంగతనం కేసులో అరెస్టై ఇటీవలే బెయిల్ పై బయటకొచ్చిన ఆమె తమ గురించి తప్పుడు ప్రచారం చేస్తోందని సౌమ్య ఫ్రెండ్ మౌనిక తండ్రి ఫిర్యాదు చేశారు. సౌమ్యపై IPC సెక్షన్‌ 380కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

New Update
SOWMYA SHETTY : నటి సౌమ్య శెట్టిపై మరో కేసు.. తండ్రి ఫిర్యాదుతో!

Vizag : బంగారం(Gold) దొంగతనం కేసులో అరెస్టై ఇటీవలే బెయిల్ పై బటయకొచ్చిన నటి సౌమ్య శెట్టి(Sowmya Shetty) పై మరో కేసు నమోదైంది. సౌమ్య శెట్టి స్నేహితురాలు మౌనిక తండ్రి ఫిర్యాదు మేరకు విశాఖపట్నం పోలీసులు(Visakhapatnam Police) సౌమ్యపై ఎఫెఐర్ ఫైల్ చేసినట్లు తెలిపారు.

తప్పుడు ప్రచారం చేస్తోంది..
ఈ మేరకు తమ ఇంట్లో బంగారం దొంగతనం(Gold Theft) చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్న సౌమ్యశెట్టి ఇప్పుడు మాట మార్చి తప్పుడు ప్రచారం చేస్తుందంటూ మౌనిక తండ్రి పోలీసులను ఆశ్రయించారు. దొంగతనం చేసినట్లు అంగీకరించిన సౌమ్య బెయిల్‌పై బయటికొచ్చి అసత్య ప్రచారం చేస్తోంది. బంగారం దొంగతనం చేయలేదని.. యూట్యూబ్‌ ఛానళ్ల(YouTube Channels) కు ఇంటర్వ్యూలు ఇస్తోంది. మా పరువు, మా అమ్మాయి పరువు తీస్తోంది. సౌమ్యశెట్టి, ఆమె తల్లి, భర్త బలరాంపై చర్యలు తీసుకోవాలంటూ మౌకి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన విశాఖ పోలీసులు సౌమ్యపై IPC సెక్షన్‌ 380కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Also Read : Neha Sharma: ఎంపీగా పోటీ చేయనున్న రామ్ చరణ్ హీరోయిన్!

Advertisment
Advertisment
తాజా కథనాలు