Ap 10th Exam Paper Leak: ఏపీలో 10th పేపర్ లీక్.. వాట్సాప్‌లో వైరల్!

కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో 10th క్లాస్ గణితం పేపర్‌ వాట్సాప్‌లో లీక్ అయింది. స్కూల్లోని వాటర్‌ బాయ్‌ వివేకానంద స్కూల్లోని విఘ్నేశ్వరరెడ్డికి పంపినట్టు అధికారులు గుర్తించారు. దీంతో పలువురిని సస్పెండ్ చేశారు.

New Update
YSR Kadapa 10th class maths paper leaked on WhatsApp in AP

YSR Kadapa 10th class maths paper leaked on WhatsApp

ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో 10th పరీక్షలు జరుగుతున్నాయి. సజావుగా సాగాల్సిన పరీక్షలు.. లీకేజ్‌ల వ్యవహారంతో సంచలనంగా మారింది. రీసెంట్‌గా తెలంగాణలో జరుగుతోన్న పదో తరగతి ప్రశ్నాపత్రం లీకై చక్కర్లు కొట్టింది. మార్చి 21వ తేదీన నల్గొండ జిల్లాలోని నకిరేకల్ గురుకుల పాఠశాలలో పరీక్ష్ మొదలైన కాసేపటికే తెలుగు ప్రశ్నాపత్రం లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. 

కడపలో పేపర్ లీక్

అది మరువక ముందే ఆంధ్రప్రదేశ్‌లో సైతం పేపర్ లీకేజ్ వ్యవహారం సంచలనంగా మారింది. క్వచ్చన్ పేపర్ ఏకంగా వాట్సాప్‌లలో పరుగులు పెట్టింది. వైఎస్సార్ కడప జిల్లాలోని వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో పరీక్షలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఆ కేంద్రాన్ని అధికారులు తనిఖీ చేశారు. దీంతో అప్పడే 10వ తరగతి గణితం పేపర్ లీకైనట్లు తెలిసింది. అది వాట్సాప్ ద్వారా పలు నంబర్లకు షేర్ అయినట్లు గుర్తించారు. 

దానిపై అధికారులు ఆరా తీయగా.. స్కూల్లోని వాటర్ బాయ్ ఇందులో ప్రధాన పాత్రధారిగా ఉన్నట్లు తెలిసింది. అతడు విద్యార్థుల నుంచి పేపర్ తీసుకుని తన వాట్సాప్ ద్వారా స్థానికంగా ఉండే వివేకానంద స్కూల్‌లో పని చేస్తున్న విఘ్నేశ్వర రెడ్డి అనే వ్యక్తికి షేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. 

దీంతో పోలీసులు ఆ వాటర్ బాయ్‌పై కేసు నమోదు చేసి విచారణ స్టార్ట్ చేశారు. ఇక విచారణ అనంతరం అధికారులు పలువురిని సస్పెండ్ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 

Also Read: వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి..జట్టును గెలిపించి!

(telugu-news | latest-telugu-news | 10th Exam Paper Leak | 10th Exam Paper Leak Case | 10th exam paper leak 10th exam paper leak in nalgonda )

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP New RationCards: మంత్రి నాదెండ్ల శుభవార్త.. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన!

పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే నుంచి కొత్త రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలపారు. ATM కార్డు సైజులో ఉండే వీటిలో క్యూఆర్‌ కోడ్‌, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని చెప్పారు. ఈ-కేవైసీ పూర్తిచేసి అందిస్తామన్నారు.

New Update
ap rationcard

ap rationcard

AP New RationCards: పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే నుంచి కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలపారు. ATM కార్డు సైజులో ఉండే వీటిలో క్యూఆర్‌ కోడ్‌, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని చెప్పారు. 

ఈ-కేవైసీ పూర్తైన తర్వాతే..

ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కార్డులో కుటుంబసభ్యులను చేర్చుకోవడంతోపాటు తొలగించేందుకు కూడా ఆప్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక ఈ-కేవైసీ పూర్తైన తర్వాతే ఎంతమందికి కార్డులు ఇవ్వాలో క్లారిటీ వస్తుందని, నేటినుంచి దీపం-2 రెండోవిడత సిలిండర్‌ బుకింగ్‌ మొదలుపెట్టినట్లు స్పష్టం చేశారు. 

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. గన్నీ బ్యాగ్స్‌ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నచ్చిన మిల్లుకు తీసుకెళ్లి రైతులు ధాన్యం అమ్ముకోవచ్చు. వాట్సప్‌ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించాం. ఇప్పటికే వాట్సప్‌ ద్వారా 16వేల మంది రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లు వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

ఇదిలా ఉంటే.. ఏప్రిల్‌ నుంచే పెంచిన పింఛన్లను అందిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. దివ్యాంగులకు రూ.6వేల పింఛన్లు, కోటిన్నర కుటుంబాలకు 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం అందిస్తున్నామని, పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి రూ.33,100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పింఛన్ల రూపంలో నెలకు రూ.2,722 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఒక నెల తీసుకోకపోయినా 3 నెల తీసుకునే అవకాశం కల్పించాం. పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో అదనంగా రూ.76 కోట్లు ఇస్తున్నామని, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ముఖ్యమంత్రి. 

ration-cards | nadendla-manohar | cm-chandrababu | telugu-news | today telugu news

 

Advertisment
Advertisment
Advertisment