Vizag Lorry Incident: విశాఖలో లారీ బీభత్సం .. పార్కులోకి దూసుకెళ్లడంతో..

విశాఖ బీచ్ రోడ్డులో లారీ బీభత్సం సృష్టించింది. ఇసుక లోడుతో వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో..  పక్కనే ఉన్న పార్కులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

New Update
vishaka lorry incident

Vizag Lorry Incident

Vizag Lorry Incident: విశాఖపట్నం బీచ్ రోడ్డులో లారీ  బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం నోవాటెల్ హోటల్ డౌన్లో ఇసుక లోడ్ తో వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో..  పక్కనే ఉన్న పార్కులోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్నవారంతా ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి అపాయం జరగకపోవడంతో స్థానికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!

వైజాక్ లారీ వీడియో 

Also Read: విశాఖలో లారీ భీభత్సము.. పార్కులోకి దూసుకెళ్లడంతో..

అలాగే రెప్పపాటు క్షణంలో ఓ కారు, బైకు పై వెళ్తున్న ప్రయాణికులు ప్రమాదం తప్పించుకున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. కారు, బైక్ లారీ కింద పడి నుజ్జు నుజ్జు అయిపోయేవి. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  పరిమితికి మించి ఇసుక లోడ్ ఉండడంతో డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. లారీ ముందు భాగం మొత్తం డ్యామేజ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read:  మెదక్ జిల్లాలో దారుణం .. తల్లి అక్రమసంబంధం కొడుకులకు తెలియడంతో

Also Read: chhaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

వైసీపీ నేతను ఎస్సై ముందే చెప్పుతో కొట్టిన టీడీపీ మహిళా నేత

వైజాగ్‌లో వైసీపీ నేత నరేంద్ర ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడు. దీంతో టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని కోసం నరేంద్ర పోలీస్ స్టేషన్‌కు రావడంతో ఆమె ఎస్సై ముందే చెప్పుతో దాడి చేసింది.

New Update

విశాఖపట్నంలో వైసీపీ నేతలపై టీడీపీ మహిళానేత దాడి చేసింది. అక్కిరెడ్డిపాలెంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న నరేంద్ర అనే వైసీపీ నేత ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశాడు. వారి దగ్గర నుంచి రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ నరేంద్రపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయంలో పోలీసులు నరేంద్రను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో అనంత లక్ష్మి చెప్పుతో దాడి చేసింది. సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు అనంతలక్ష్మిపై కేసు నమోదు చేశారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు