AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!

ఏపీకి మరో వందే భారత్ ట్రైన్ వచ్చే అవకాశం ఉంది. విశాఖ-తిరుపతి మధ్య కొత్త వందే భారత్ ట్రైన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. లోక్ సభలో ఏపీకి చెందిన ఎంపీ ఈ విషయంపై కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.

New Update
Vande Bharat Express: నేడు కాచిగూడు-యశ్వంత్‎పూర్ వందేభారత్ ఎక్స్‎ప్రెస్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ..!!

Ap: ఏపీకి  మరో వందేభారత్ రైలు రానుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఏపీ నుంచి ఇప్పటికే కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించాలని కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. పలువురు ఎంపీలు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి ఈ విషయం గురించి విజ్ఙప్తి చేశారు. అయితే కొన్ని రైళ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.ఈ మేరకు ఒకటి, రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు తాజాగా మరో వందేభారత్ రైలు ప్రతిపాదనాలు తెరపైకి వచ్చాయని సమాచారం.

Also Read: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

విశాఖ నుంచి వందేభారత్‌ రైళ్ల సంఖ్యను మరిన్ని పెంచాలని పలువురు ప్రజా ప్రతినిధులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే విశాఖపట్నం ఎంపీ వందేభారత్ రైళ్ల సంఖ్యను పెంచాలని కోరారు. విశాఖ నుంచి బెంగళూరుకు రైలు నడపాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే తాజాగా మరో ప్రతిపాదనను అధికారులు తీసుకొచ్చారు. విశాఖ నుంచి బెంగళూరుతో పాటుగా తిరుపతికి కూడా వందేభారత్ నడపాలని ప్రజా ప్రతినిధులు రైల్వే అధికారుల్ని కోరారు.

Also Read: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు

 అయితే తిరుపతి, బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్లాన్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ విషయం గురించి రైల్వే అధికారుల నుంచి సానుకూలంగా స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ క్లాస్ నడిపే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా  క్లారిటీ రావాల్సి ఉండగా..దానికి కొంత సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Also Read: పైలెట్ చేసిన తప్పువల్లే కమాండర్ బిపిన్ రావత్ మృతి

ప్రస్తుతం విశాఖ నుంచి నాలుగు వందేభారత్‌ రైళ్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు రెండు.. భువనేశర్వ్, దుర్గ్‌కు చెరొకటి నడుస్తున్నాయి. విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ నడిపేందుకు ఆలస్యం అవుతుందని.. కనీసం ఆరు నెలలైనా సమయం పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. చెన్నైలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ వందేభారత్ స్లీపర్ క్లాస్ రైళ్లు ఉత్పత్తి చేస్తున్నారు. అయితే తొలి వందేభారత్ స్లీపర్ క్లాస్ జనవరి నాటికి అందుబాటులోకి వస్తుందనే సమాచారం ఉంది.

Also Read: Delhi: బాణాసంచాపై  ఢిల్లీలో శాశ్వత నిషేధం

దీన్ని బట్టి విశాఖపట్నం కోటా వచ్చేసరికి కనీసం ఆరు నెలలు సమయం పడుతుందని అధికారులు అనుకుంటున్నారు. వచ్చే ఏడాది జూన్, జులై నాటికి విశాఖపట్నం-తిరుపతి వందేభారత్‌ స్లీపర్ క్లాస్‌ మొదలువుతుందని తెలుస్తుంది.  విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్‌ పట్టాలెక్కితే మంచి ఆదరణ ఖాయం అంటున్నారు. అయితే దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. అంతేకాదు తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ఈ విశాఖ- తిరుపతి వందేభారత్ స్లీపర్ రైలు అంశాన్ని ప్రస్తావించారు. 

మరోవైపు ఇటీవల ఏపీకి మరో కొత్త వందేభారత్ వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. విజయవాడ నుంచి బెంగళూరుకు వయా గుంటూరు, పల్నాడు, రాయలసీమ మీదుగా వందేభారత్ ప్రారంభం అవుతుందనే చర్చ నడుస్తుంది. గతంలోనే స్థానిక ప్రజా ప్రతినిధులు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి కోరగా.. సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.అయితే అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.

New Update
cm chandra babu

cm chandra babu

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అర్హతలు

ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.

21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి. 

ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

https://apobmms.apcfss.in/  లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ నింపాలి.

andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes

Advertisment
Advertisment
Advertisment