Tirumala Tirupati:  ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు..తెలంగాణ సిఫారసు లేఖలను....

శ్రీవారి ఆలయంలో 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 25న కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం, 30న ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 24, 29వ తేదీల్లో సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.

New Update
Tirumala Tirupati

Tirumala Tirupati

Tirumala Tirupati: శ్రీవారి ఆలయంలో 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ  ఓ ప్రకటనలో తెలిపింది. 25న కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం, 30న ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో 24, 29వ తేదీల్లో ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఈ నెల 23న స్వీకరించి 24న దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి

మార్చి 24 నుండి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖ‌ల‌పై తిరుమలలో శ్రీ‌వారి ద‌ర్శనం అమలులోకి రానున్న నేపధ్యంలో.. ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. మార్చి 25 మ‌రియు మార్చి 30వ తారీఖుల్లో శ్రీ‌వారి ఆల‌యంలో వీఐపీ బ్రేక్ ద‌ర్శనాలు ర‌ద్దు చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు.. శ్రీవారి దర్శనం మార్చి 24వ తారీఖు నుండి అమ‌లులోకి రానుంది. ఇందులో భాగంగా ఆదివారం సిఫార్సు లేఖ‌లను అధికారులు స్వీకరించనున్నారు.

ఇది కూడా చూడండి: Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?

అయితే ఇదివ‌ర‌కే టీటీడీ తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈనెల 30వ తారీఖున శ్రీ విశ్వావ‌సు నామ సంవ‌త్సర తెలుగు ఉగాది ఆస్థానాన్ని పుర‌స్కరించుకుని.. మార్చి 25వ తారీఖున మంగ‌ళ‌వారం నాడు శ్రీ‌వారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో వీఐపీ బ్రేక్ ద‌ర్శనాలు ర‌ద్దు చేసారు. ఈ కార‌ణంగా మార్చి 25వ తేదిన వీఐపీ బ్రేక్ ద‌ర్శనం కొర‌కు మార్చి 24వ తారీఖున ఎటువంటి సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వ‌ని టీటీడీ ప్రకటించింది.

ఇది కూడా చూడండి: Gold and Sliver Prices: దిగ..దిగనంటోన్న బంగారం.. మార్కెట్ ఎలా ఉందంటే..?

అదేవిధంగా ఇప్పటివరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం నాడు.. ఆదివారం దర్శనం కొరకు.. స్వీకరిస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు. మార్చి 30వ తారీఖున ఆదివారం నాడు శ్రీ‌వారి ఆల‌యంలో ఉగాది ఆస్థానాన్ని పుర‌స్కరించుకుని వీఐపీ బ్రేక్ ద‌ర్శనాలు ర‌ద్దు చేసారు. ఈ మేరకు టీటీడీ అధికారులు మీడియాకు ప్రకటన విడుదల చేసారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు