AP: విడదల రజనిపై అసభ్యకర పోస్టులు.. లోకేష్, పవన్ పై అంబటి ఆరోపణలు!

వైసీపీ సోషల్ మీడియా టీమ్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు అంబటి రాంబాబు. లోకేష్, పవన్ పోలీసులను ఒత్తిడి చేస్తూ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. విడుదల రజనిపై పెట్టిన అసభ్యకర పోస్టులపై డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

New Update
ssewe

AP News: వైసీపీ నాయకురాలు విడుదల రజనిపై అసభ్యకర పోస్టులు పెట్టడంపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మహిళా నాయకురాలిపై టీడీపీ నాయకులే దారుణంగా పోస్టులు పెట్టారని ఆరోపించారు. అంతేకాదు ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.  పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తే ఇబ్బంది పడతారని, డీజీపీ పొలిటికల్ విమర్శలు మానుకోవాలన్నారు. డీజీపీకి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేసినా న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయిందంటూ సంచలన కామెంట్స్ చేశారు. 

వారిని అరెస్ట్ చేయడం దురదృష్టకరం.. 

ఈ మేరకు వైసీపీ లీగల్ ప్రతినిధులతో నగరంపాలెం, అరండల్ పేట పోలీస్ స్టేషన్లకి వెళ్లిన అంబటి రాంబాబు.. టీడీపీ అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు పోలీసులు అరెస్ట్ చేసిన ఇంటూరి రవి కిరణ్ , మేకా వెంకటరామిరెడ్డిని పరామర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. గత ప్రభుత్వంలో పోస్టులు పెట్టారని ఇప్పుడు రవికిరణ్ ని, వెంకటరామిరెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు. సోషల్ మీడియా కేసుల్లో 41 నోటీస్ ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని, అయినప్పటికీ తెలుగుదేశం నాయకులు వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. 

లోకేష్, పవన్ కళ్యాణ్ పోలీసులపైన ఒత్తిడి..

వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై లోకేష్, పవన్ కళ్యాణ్ పోలీసులపైన ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టిస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు భయపడరు. పథకాలు ఎందుకు అమలు చేయలేదని సోషల్ మీడియాలో అడిగినా కూడా కేసులు పెడుతున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: 45 రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

TTD 45రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో మే1 - జూన్ 15 వరకు ఎమ్మెల్యే,ఎంపీ, ప్రముఖుల సిఫార్సులపై జారీచేసే బ్రేక్ దర్శనాలను క్యాన్సిల్ చేసింది. ప్రొటోకాల్ పరిధి ప్రముఖులు స్వయంగా వస్తే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది.

New Update
TTD cancels VIP break darshans for 45 days

TTD cancels VIP break darshans for 45 days

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 45 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వేసవి సెలవులు ప్రారంభం అయ్యియి. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

మే1 నుంచి రద్దు

ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రముఖుల సిఫార్సులపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. అదే సమయంలో కేవలం ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు మే 1వ తేదీ నుంచి ఉదయం 6 గంటలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. 

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

ఒక్కరోజే 82,811 మంది భక్తులు

ఇదిలా ఉంటే TTDలో టోకెన్లు లేని భక్తులకు దాదాపు 18 గంటల సమయం పైనే పడుతోంది. కేవలం ఒక్క శనివారం రోజే భారీగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. సుమారు 82,811 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయంలో 34,913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కేవలం ఆ ఒక్క రోజే రూ.3.24 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది. 

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

Also read: కాంగ్రెస్ వాళ్లను ఉరికిచ్చి కొడతా... ఎర్రబెల్లి దయాకర్ రావు ఫుల్ ఫైర్

telugu-news | ttd | latest-telugu-news | tirumala tirupati temple

Advertisment
Advertisment
Advertisment