అమరావతికి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. భారీగా నిధులు!

అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. 57 కి. మీ పొడవున కొత్త రైల్వే వంతెన నిర్మాణానికి మొత్తం రూ.2245 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు.

New Update
Amaravati: రాజధాని నిర్మాణాల సీఆర్‌డీఏ కీలక ఆదేశాలు

Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. 57 కి. మీ పొడవున కొత్త రైల్వే వంతెన నిర్మాణం జరగడానికి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.2245 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. కృష్ణ నదిపై 3.2 కి.మీ పొడవు మేర మూడు బ్రిడ్జ్‌ల నిర్మాణం జరగనుంది. 

ఇది కూడా చూడండి: ఈ ఏడాది చివరి నాటికి మతిపోయే టెక్నాలజీ.. అంబానీ మరో సంచలన ప్రకటన!

దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను కలుపుతూ..

హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, నాగపూర్‌తో పాటు దేశంలో ఉండే ప్రధాన మెట్రో నగరాలను కలిపి రైల్వే కనెక్టవిటీని నిర్మించనున్నారు. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. 

ఇది కూడా చూడండి: పెప్సీ, కోకా కోలా నుంచి ఇకపై బడ్జెట్ డ్రింక్స్.. కారణమేంటి?

ఈ కొత్త రైల్వే లైన్‌ను అమరావతి స్థూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వరస్వామి ఆలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్ట్‌కి వెళ్లే వారికి అనుగుణంగా అభివృద్ధి చేయనున్నారు. అలాగే కృష్ణ పట్నం, మచిలీపట్నం, కాకినాడ పోర్టులను కూడా కలుపుతూ రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు.  

ఇది కూడా చూడండి: Samantha : ప్రభాస్ - సమంత కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

ఏపీతో పాటు బిహార్‌కు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. బిహార్‌లో కొత్త రైల్వే లైన్‌కు రూ.4553 కోట్లు కేటాయించింది. ఈ రైల్వే లైన్‌కు సంబంధించి ఇప్పటికే ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. ఈ కొత్త రైల్వే లైన్ వల్ల రాష్ట్ర రాజధాని అయిన అమరావతికి రవాణా కనెక్టివిటీ వల్ల అభివృద్ధి పెరుగుతుందని రాష్ట్రం భావిస్తోంది.

ఇది కూడా చూడండి: IAS Amoy Kumar: ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి.. మాజీ మంత్రికి షాక్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఏం తమాషాలా.. గంటాపై టీడీపీ హైకమాండ్ సీరియస్!

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ట్వీట్‍పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా మన పార్టీ వారే కదా అని గంటాని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

New Update

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ట్వీట్‍పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఏపీలో విమాన సర్వీస్‍ల జాప్యంపై గంటా శ్రీనివాస్ నిన్న ట్వీట్ చేశారు. ఏపీ టూ ఏపీ వయా తెలంగాణ అంటూ ఆయన చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో స్పందించిన టీడీపీ హైకమాండ్.. ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా మన పార్టీ వారే కదా అని గంటాని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు రామ్మోహన్‍కి ఫోన్ చేయొచ్చు కదా..? అని ఫైర్ అయినట్లు సమాచారం. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కావొద్దని గంటాకు టీడీపీ హై కమాండ్ స్పష్టం చేసినట్లు చర్చ సాగుతోంది. 

Advertisment
Advertisment
Advertisment