చచ్చిన ఈ కోడి ధర రూ.లక్ష.. ఎందుకంత స్పెషల్!

కేజీ చికెన్ ధర మహా అయితే ఎంతుంటుంది... రూ. 300 లేదా రూ. 400 కానీ ఈ కోడి ధర రూ.లక్ష కంటే ఎక్కువ ఉందంటే  మీరు నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఏముంది ఈ కోడిలో.. అంత ధర ఎందుకో తెలియాలటే ఈ వార్త పూర్తిగా చదవండి.

New Update
cock fighting

cock fighting Photograph: (cock fighting )

కేజీ చికెన్ ధర మహా అయితే ఎంతుంటుంది... రూ. 300 లేదా రూ. 400 కానీ  కోడి ధర రూ.లక్ష కంటే ఎక్కువ ఉందంటే  మీరు నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.  పై ఫోటోలో చూస్తున్న ఈ కోడి ధర  అక్షరాల రూ.లక్ష 11వేలు. అయితే ఈ కోడి ధర ఎందుకు ఇంత ఎక్కువగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఏపీ అనగానే సంక్రాంతి పండగ..ఈ పండగకు అక్కడ కోడిపందాలు జోరుగా సాగుతాయి. గోదావరి జిల్లాల్లో ఇటీవల రెండు కోళ్ల మధ్య జరిగిన పోట్లాటపై కోటి రూపాయల పందెం వేయగా, ఆ పోరాటంలో గెలిచిన కోడి యజమాని కోటి రూపాయలు గెలుచుకున్నాడు. అయితే ఓడిపోయిన కోడికి పందెం వేయగా ఏకంగా రూ. లక్ష 11 వేల 111 కు కొనుగోలు చేశాడు. ఎందుకంటే  అది కోజా పుంజు కావడమే.

కోజా పుంజు గురించి  అంటే సింపల్ గా చెప్పాలంటే.. సంక్రాంతి పండగ పోటీలకు పుంజులకు కొన్ని నెలల పాటు బలవర్ధకమైన ఆహారం పెట్టి పెంచుతారు.  అయితే పోటీల్లో ఓడిపోయిన  పుంజును కోజా పుంజు అని పిలుస్తారు.  దీనిని ఎవ్వరికీ పందెం రాయుళ్లు ఇవ్వరు. కోజా పుంజు సాధారణ కోడి కంటే చాలా రుచిగా ఉంటుంది.  

వదులుకోవడం ఇష్టం లేక

తాజాగా  ఏలూరు యన్ఆర్ పేటకు చెందిన రాజేంద్ర, ఆహ్లద్, రాజవంశీలు కోడిపుంజులు పెంచుతారు. అయితే సంక్రాంతి పోటీల్లో వారి కోడి ఓడిపోయింది. రూల్ ప్రకారం ఆ పుంజు గెలిచిన వారికి సొంతం కావాలి. అయితే దాన్ని వదులుకోవడం ఇష్టం లేక  వారికి మళ్లీ డబ్బు చెల్లించి వెనక్కు తీసుకున్నాడు వంశీ. దాని గొప్పతనం అందరికీ తెలిసే విధంగా చేయాలని కోజా (చనిపోయిన కోడి)ని వేలం పాటకు పెట్టాడు. ఈ పాటలో ఏలూరు రూరల్ మండలం జాలిపూడికి చెందిన మాగంటి నవీన్ చంద్రబోస్ దాన్ని ఏకంగా రూ. లక్ష 11 వేలకు దక్కించుకున్నాడు. చనిపోయిన కోడిని ఇంత ధర పెట్టి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

Also Read :  ఇన్స్టా బ్యూటీ మోనాలిసాకు బంపరాఫర్.. ఏకంగా బాలీవుడ్ సినిమాలో

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 6గురి దుర్మరణం.. కన్నీరు పెట్టించే వీడియోలు..!

అనకాపల్లిలో దారుణం జరిగింది. కైలాసపట్నంలోని బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు కంటతడి పెట్టిస్తున్నాయి. విగతజీవులుగా మృతులు దృశ్యాలు ఉన్నాయి.

New Update

అనకాపల్లిలో దారుణం జరిగింది. కైలాసపట్నంలోని బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 

విగతజీవులుగా పడివున్న దృశ్యాలు

వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తుంది. ఇక ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారు హాస్పిటల్‌ ప్రాణాలతో పోరాడుతున్నారు. మరికొందరు సంఘటనా స్థలంలోనే విగతజీవులుగా కనిపిస్తున్నారు. శరీరం మొత్తం కాలిపోయి విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు కంటతడి పెట్టిస్తున్నాయి. 

https://x.com/YSRCParty/status/1911354811322089657

fire accident | latest-telugu-news | telugu-news | viral-videos

Advertisment
Advertisment
Advertisment