ఇంటి పైకప్పు కూలి ముగ్గురు మృతి

అనంతపురం కుందుర్పి మండలం ఎనుములదొడ్డి పంచాయతీ పరిధిలోని రుద్రంపల్లి గ్రామంలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఇంటిపై కప్పు కూలి ఇంట్లో ఉన్న ముగ్గురు కుటుంబసభ్యులు ముగ్గురు మృతిచెందారు.

New Update
Anantapur district

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎనుములదొడ్డి పంచాయతీ పరిధిలోని రుద్రంపల్లి గ్రామంలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఇంటిపై కప్పు కూలి ఇంట్లో ఉన్న ముగ్గురు కుటుంబసభ్యులు కురుబ గంగన్న (43), ఆయన భార్య శ్రీదేవి (38), 9వ తరగతి చదువుతున్న వీరి కూతురు సంధ్య(14) మృతిచెందారు.

Also Read: AP: అయ్యప్ప భక్తులకు తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు!

గంగన్న టీడీపీ కార్యకర్త. విషయం తెలుసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read: ApsRTc: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ ఏమన్నారంటే!

ఇది కూడా చదవండి : TTD: టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులకు అడిగినన్ని లడ్డూలు

ప్రస్తుతం శబరిమల యాత్రలో వున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వెంటనే స్పందించి, ఫోన్ ద్వారా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తక్షణ సహాయం కింద ఎమ్మెల్యే అమిలినేని రూ.50 వేల ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి తక్షణ సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. టీడీపీ కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే గారు విచారం వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pastor Praveen: ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే.. ప్రూఫ్స్ ఇవే.. హర్షకుమార్ సంచలన వీడియో!

పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిన్న పోలీసులు నిర్వహించిన ప్రెస్ మీట్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ ఫైర్ అయ్యారు. మళ్లీ పాత వీడియోలనే విడుదల చేశారన్నారు. యాక్సిడెంట్ అయితే ప్రవీణ్ బ్యాంక్ ఖాతాలు ఎందుకు సీజ్ చేశారని ప్రశ్నించారు. ఇదో నాన్సెన్ ఇన్వెస్టిగేషన్ అన్నారు.

New Update
Pastor Praveen Death GV Harsha Kumar Video

Pastor Praveen Death GV Harsha Kumar Video

ప్రవీణ్ పగడాల మృతి ఆక్సిడెంట్ వల్ల కాదని నమ్ముతున్నాను.మొదటి నుంచి పోలీస్ ఆక్సిడెంట్ కోణంలోనే దర్యాప్తు చేశారు. ఆక్సిడెంట్ అయితే ప్రవీణ్ బ్యాంక్ ఖాతాలు ఎందుకు సీజ్ చేశారు? Laptop, I pad ఎందుకు పోలీస్ లు పట్టుకెళ్లారు.విజయవాడలోనూ కొవ్వూరు లోను ప్రవీణ్ ను పిలిచినది ఎవరు? అసలు షెడ్యూల్ లో మహారాష్ట్ర పూణే వెళ్ళవలసి ఉండగా విజయవాడ,కొవ్వూరు లలో మీటింగ్ ల గురించి షెడ్యూల్ మార్చుకొన్నది నిజం కాదా? బండి ఆబ్జెక్ట్ కు గుద్దితే బండి పై కెగిరి ముందుకు పడాలి గానీ మనిషి మీద పెట్టినట్టు ఎందుకు ఉంది? ఇటువంటి నాన్సెన్ ఇన్వెస్టిగేషన్ లు చేసి మళ్ళీ వీటి మీద మాట్లాడితే చర్యలు తీసుకుంటామని ఎవర్ని బెదిరిస్తారు? అంటూ ధ్వజమెత్తారు.

( Harsha Kumar | telugu-news | telugu breaking news | Pastor Praveen )

Advertisment
Advertisment
Advertisment