తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి..ఈ జాగ్రత్తలు తప్పనిసరి మరి

తెలుగు రాష్ట్రాలలో చలితీవ్రత రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. ఉదయం 10 అయినప్పటికీ కూడా చలితీవ్రత తగ్గడం లేదు. రెండు రాష్ట్రాల్లో చాలాచోట్ల రాత్రి పూట ఉష్ణోగ్రతలు 13 నుంచి 14 డిగ్రీల స్థాయికి పడిపోయాయి.

New Update
twlugu

Winter: తెలుగు రాష్ట్రాల్లో చలి రోజురోజుకు పెరుగుతుంది. దీంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పడిపోతున్నాయి. దీంతో కొన్నిచోట్ల రాత్రి వేళ ఉష్ణోగ్రతలు 13 నుంచి 14 డిగ్రీల వరకూ నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. పగటి వేళ కూడా అత్యల్పంగా 20 నుంచి 23 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే రోజుల్లో చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Also Read: ఐపీఎల్‌ మెగావేలం.. ఇప్పటివరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల ఫుల్‌ లిస్ట్‌

వాతావరణంలో మార్పుల నేపథ్యంలో వైరల్‌ వ్యాధులుతో పాటు , సీజనల్‌ వ్యాధులు కూడా  మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు. అలాగే జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్తమా, సీవోపీడీ వంటి సమస్యలతో బాధపడేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.

Also Read: Google Maps: విషాదం.. గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్మి ముగ్గురు మృతి

చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మూడు పూటలా వేడి ఆహారమే తీసుకోవాలని సూచిస్తున్నారు. చలికాలంలో ఆహారం, నీటితో అంటువ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉన్నందున.. కాచి చల్లార్చిన గోరు వెచ్చని నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. 

Also Read: Jagan: చంద్రబాబుకు జగన్ 6 ప్రశ్నలు.. చెప్పే దమ్ముందా అంటూ..!

ఎండ వచ్చాక...

ఉదయం పూట వాకింగ్ వెళ్లే అలవాటు ఉన్నవారు కూడా..ఎండ వచ్చాక వాకింగ్ వెళ్లడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.  పొగమంచు కారణంగా శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. అందుకే కాస్త ఎండ వచ్చాక వాకింగ్ చేయడం బెటరని వైద్యులు సూచిస్తున్నారు. 

Also Read: ఝార్ఖండ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్.. ఎప్పుడంటే ?

అలా వీలుకాని పక్షంలో  సాయంత్రం పూట అయినా సరే వ్యాయామం చేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.ఇక ఉదయం పూట చలికి ప్రయాణాలు చేసేవారు,ఇతర పనుల మీద బయటకు వచ్చేవారు కూడా ఉన్ని దుస్తులు వేసుకోవాలని.. వీలైతే చేతులకు గ్లౌజులు, ముక్కు, చెవులు మూసే విధంగా మంకీ క్యాపులు ధరించాలని వైద్యులు చెబుతున్నారు.

ఇంట్లో ఏడాదిలోపు చిన్నారులు ఉంటే వ్యక్తిగత శుభ్రతకు మరింత ప్రాధాన్యమివ్వాలని.. చేతులను శుభ్రపరుచుకున్న తర్వాతే పసిపిల్లలను ఎత్తుకోవాలని వైద్యులు అంటున్నారు. అలాగే వీలైనంత వరకూ బయట తిప్పకపోవటమే మంచిదని చెప్తున్నారు. భోజనం చేసేముందు చేతులు శుభ్రపరుచుకోవడం.. బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత సబ్బుతో కాళ్లూ, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని  చెబుతున్నారు. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మంచి ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు అంటున్నారు.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: న్యూస్ అప్డేట్స్

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Earthquake: మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ భూ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. హిందూకుష్ ప్రాంతంతో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

Also Read :  కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?

  • Apr 16, 2025 11:28 IST

    రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!

    రీల్స్ పిచ్చితో ఓ మహిళ గంగానదిలో కొట్టుకుపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని మణికర్ణిక ఘాట్ వద్ద రీల్స్ కోసం గంగానదిలో దిగగా.. కాలు జారింది. ఇదే సమయంలో నీటి ప్రవాహం పెరగడంతో ఆ మహిళ నీటిలో కొట్టుకుని మృతి చెందింది. పోలీసులు ఇప్పటికీ ఆమె మృతదేహాన్ని గుర్తించలేదు.

    viral video up
    viral video up

     



  • Apr 16, 2025 09:34 IST

    హైదరాబాద్ లో రెండు కంపెనీలపై ఈడీ సోదాలు..

    హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్లో ప్రాంతాల్లో ఇవి జరిగాయి. 

    ed



  • Apr 16, 2025 09:20 IST

    షేక్ హసీనాకు బిగ్ షాక్.. ఈసారి అరెస్టు కావడం పక్కా?

    బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమె కుమారుడు సజీబ్‌ వాజిద్‌కు కోర్టు అరెస్టు వారంట్లు జారీచేసింది. వీరితో పాటు మరో 16 మందికి అరెస్టు వారంట్లు జారీచేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన రెండు కేసుల్లో వీరిపై అరెస్ట్ వారంట్లు జారీ చేసింది.

    sheikh Hasina
    sheikh Hasina

     



  • Apr 16, 2025 09:19 IST

    ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్!

    ఏపీలో మరో ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుండగా మే 13లోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.

    EC



  • Apr 16, 2025 07:26 IST

    పోలీసింగ్‌లో నెంబర్‌ వన్‌గా తెలంగాణ..

    తెలంగాణలో పోలీసుశాఖ పనితీరు దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌-2025’ పేరుతో టాటా ట్రస్ట్‌ మంగళవారం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.



  • Apr 16, 2025 07:25 IST

    కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?



  • Apr 16, 2025 07:25 IST

    మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

    అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

    earthquake



Advertisment
Advertisment
Advertisment