/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/srisailam-jpg.webp)
Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో టోల్ గేట్ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. శ్రీశైలం ఆలయానికి వెళ్లే దారిలో ఎంట్రన్స్ లో ఎన్నో సంవత్సరాలుగా ఒక టోల్ గేట్ నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఆ మార్గంలో వెళ్లే వాహనాలకు టోల్ ఛార్జీలు టోల్ గేట్ సిబ్బంది వసూలు చేస్తుంటారు. టోల్గేట్లో పని చేసే సిబ్బంది.. గత కొంత కాలంగా చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు భారీగా వినపడుతున్నాయి.
Also Read: Cinema: బాక్సాఫీసు కొల్లగొడుతున్న డాకూ మహరాజ్..3 రోజుల్లో 50 కోట్లు
ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు చెప్పాపెట్టకుండా ఉన్నఫళంగా ఆ టోల్గేట్లో తనిఖీలు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. అధికంగా టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ క్రమంలోనే ఏకంగా 8 మంది సిబ్బంది పై శ్రీశైలం దేవస్థానం అధికారులు వేటు వేశారు.
Also Read: క్రిటికల్ కండిషన్లో లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు..మరింత వేగంగా గాలులు.
టోల్గేట్ వద్ద శ్రీశైలం దేవస్థానం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో టోల్గేట్లో ఉండాల్సిన డబ్బు కంటే ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎక్కువగా ఉన్న ఆ డబ్బు ఎక్కడిది అని అధికారులు.. ప్రశ్నించగా.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో మరింత లోతైన విచారణ చేపట్టిన అధికారులకు అసలు విషయం బయటపడింది. నిర్ణయించిన టోల్ ఛార్జీల కంటే అధికంగా టోల్ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు నిర్థారించుకుంది.
శ్రీశైలానికి వచ్చే ప్రతి వాహనం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన టోల్గేట్ ద్వారా వాహనదారుల నుంచి టోల్ ఫీజులు వసూలు చేస్తారు. ఈ క్రమంలోనే జనవరి 5వ తేదీన శ్రీశైలం దేవస్థానం అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లోనే అసలు బండారం బయటపడింది. అప్పటి నుంచి విచారణ జరపగా.. తాజాగా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తేలింది. ఆన్ లైన్ పేమెంట్ కాకుండా వాహనదారుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
Also Read: Musk: ఆ విషయం లేట్ గా చెప్పారు..మస్క్ పై అమెరికా రెగ్యులేటర్ దావా!
Also Read: Mahakumbh:కుంభమేళాలో పాల్గొనే 14 అఖాడాలు ఇవే..అసలు వాటి చరిత్ర ఏంటంటే