శ్రీకాకుళంలో నకిలీ నోట్ల కలకలం.. నిందితుల్లో వైసీపీ నాయకుడు!

శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్లు తయారు చేసి మార్కెట్‌లో చెలామణి చేస్తున్న రెండు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రా - ఒడిశా సరిహద్దు మెళియాపుట్టి మండలం సంతలక్ష్మీపురం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి రవి సహా మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు.

New Update
fake currency

ఈజీ మనీకి అలవాటుపడిన కొందరు అడ్డదారిలో డబ్బులు ఎలా సంపాదించాలా అని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో దొంగ నోట్ల కరెన్సీకి పాల్పడుతున్నారు. లక్షలు, కోట్లలో నకిలీ నోట్లు తయారు చేసి మార్కెట్‌లో చెలమనీ చేస్తున్నారు. ఈ గుట్టు రట్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి.. దీనికి పాల్పడిన వారిని కటకటాల్లోకి పంపిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగ నోట్లను రూపొందించిన రెండు ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’‌లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!

ఆంధ్రా - ఒడిశా సరిహద్దు అయిన మెళియాపుట్టి మండలం సంతలక్ష్మీపురం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి రవిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ నోట్ల కరెన్సీ డబ్బును చెలామనీ చేస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని.. అతడి వద్ద నుంచి రూ.50 వేల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో నిందితుడిని విచారించగా మొత్తం వివరాలను బయటపెట్టాడు.

 Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ...

ఈ దొంగ నోట్ల కరెన్సీ వ్యాపారంలో ఎవరెవరు ఉన్నారో వారందరి పేర్లు బయటపెట్టడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. పలాస, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి మండలాలకు చెందిన తమ్మిరెడ్డి ఢిల్లీరావు, దాసరి రవికుమార్, కుసిరెడ్డి దుర్వాసులు (శంకర్‌రెడ్డి), దుమ్ము ధర్మారావు, దాసరి కుమారస్వామిలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 

Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు  

నిందితుల్లో వైసీపీ నాయకుడు

దాదాపు రూ.57.25 లక్షల నకిలీ నోట్లతో పాటు తయారీకి ఉపయోగించిన కలర్‌ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక స్కూటీ, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుల్లో వైసీపీ నాయకుడు, కరజాడ ఎంపీటీసీ సభ్యుడు దాసరి రవికుమార్‌ను పోలీసులు ఎ-5గా చేర్చారు.

Also Read: స్కూళ్లు బంద్‌పెట్టి టీచర్ల దావత్..ప్రభుత్వ అధికారులు సైతం హాజరు

కాగా ఇందులో పట్టుబడ్డ కుసిరెడ్డి దుర్వాసులు, తమ్మిరెడ్డి రవి గతంలో బ్లాక్ కరెన్సీ, పురాతన నాణేలతో నేరాలకు పాల్పడినట్లు టెక్కలి డీఎస్పీ మూర్తి తెలిపారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. వీరు యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ నోట్ల తయారీ చేసి వాటిని ఒడిశా నుంచి చెలామణి చేయాలని ప్లాన్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING : సింహాచల ఘటన.. ఏడుగురు సస్పెండ్

సింహాచల ఘటనపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణ కమిటి ఆధారంగా ఏడు అధికారులపై సస్పెషన్ వేటు వేసింది. దేవాదాయ, పర్యాటక శాఖలకు చెందిన ఏడుగురు అధికారులపై  సస్పెషన్ వేటు పడింది.

New Update
simhachala incident

simhachala incident

సింహాచల ఘటనపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  త్రిమెన్ విచారణ కమిటి ఆధారంగా ఏడు అధికారులపై సస్పెషన్ వేటు వేసింది. దేవాదాయ, పర్యాటక శాఖలకు చెందిన ఏడుగురు అధికారులపై  సస్పెషన్ వేటు పడింది.  సింహాచల దేవస్థానం డిప్యూటీ ఈఈ మూర్తి, జేఈ బాబ్జీ,  ఏపీటీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈ స్వామి, ఏఈ మదన్ మోహన్ లను సస్పె్ండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రక్టర్  కే లక్ష్మినారయణను బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రక్టర్ తో సహా ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. 

నివేదికలో సంచలన విషయాలు

సీఎం చంద్రబాబుకు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని ప్రాథమిక నివేదికలో కమిషన్‌ వెల్లడించింది. భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున నీరు, బురద చేరి బరువు కారణంగా గోడ కూలినట్టు కమిషన్‌ అభిప్రాయపడింది.

కాగా గత బుధవారం (ఏప్రిల్ 30 తేదీ) తెల్లవారుజామున భారీ వర్షానికి గోడ కూలడంతో ఏడుగురు చనిపోయారు. ఈ ఘటన పై ప్రభుత్వం మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ అధ్యక్షతన, ఈగల్‌ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు సభ్యులుగా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.ప్రమాదంపై 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారు నివేదిక అందజేశారు.

పునాదులు లేకుండా నిర్మించిన గోడ దిగువకు నీరు వెళ్లేందుకు లీప్ హోల్స్ కూడా లేవని కమిషన తన  ప్రాథమిక నివేదికలో పేర్కోంది. చందనోత్సవానికి వారం రోజుల ముందు ఈ గోడను హడావిడిగా నిర్మించినట్టు స్పష్టం చేసింది. ప్రసాద్ స్కీమ్ లో భాగంగా గోడ నిర్మాణానికి హడావిడిగా అనుమతులిచ్చారని కమిషన్‌ పేర్కొంది.గోడ నిర్మాణానికి ఎలాంటి డిజైన్లు లేక పోగా పునాది కూడా లేకుండా నిర్మించేశారని ప్రాథమిక నివేదికలో కమిషన్‌ పేర్కొంది. గోడ పటిష్టత గురించి గానీ, భక్తుల భద్రత గురించిగానీ ఎలాంటి తనిఖీలు చేయలేదని కమిషన్‌ తెలిపింది.

Also read : TGSRTC : ఆర్టీసీ సమ్మె... ఉద్యోగులను బెదిరిస్తే..అంతే సంగతులు సిబ్బందికి యాజమాన్యం బహిరంగ లేఖ...

Advertisment
Advertisment
Advertisment