Sri Varshini - Aghori: ప్రభాస్ ఇంటి పక్కన రూ.8 కోట్ల విల్లా.. అఘోరీ ఆస్తులు బయటపెట్టిన వర్షిణీ పేరెంట్స్!

వర్షిణీ పేరెంట్స్ అఘోరీ ఆస్తులకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ‘అఘోరీ స్మశానంలో పెద్ద పెద్ద వాళ్లకోసం పూజలు చేస్తుంది. అలా రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలు వసూళు చేస్తుంది. అలాగే ప్రభాస్ ఇంటి పక్కన రూ.8 కోట్ల విలువైన విల్లా ఉంది’ అని చెప్పుకొచ్చారు.

New Update
Sri Varshini Parents Sensational Comments on Lady Aghori Assets.

Sri Varshini Parents Sensational Comments on Lady Aghori Assets

అఘోరీ వ్యవహారం రచ్చకెక్కింది. వర్షిణీ తల్లిదండ్రులు అఘోరీపై తీవ్ర ఆరోపణలు చేశారు. క్షుద్రపూజలు చేసి.. వర్షిణీని అఘోరీ వశపరచుకుందని అంటున్నారు. ఇటీవలే గుజరాత్‌లో అఘోరీతో ఉన్న వర్షిణీని ఆమె అన్నయ్యలు పట్టుకుని ఇంటికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వర్షిణీ ఫ్యామిలీని RTV ఛానెల్ సంప్రదించగా.. వారు అఘోరీ గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

అఘోరీకి డబ్బులు

ముఖ్యంగా అఘోరీకి డబ్బులు ఎలా వస్తున్నాయి?.. ఎంత వస్తున్నాయి?.. ఆమెకు ఆస్తులు ఉన్నాయా? లేదా? అనే దాని గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. తనకు డబ్బులు ఎలా వస్తాయి అనేది అఘోరీ తమకు చెప్పిందని వారు అన్నారు. ఈ మేరకు వర్షిణీ పేరెంట్స్ మాట్లాడుతూ.. తాను స్మశానంలో పూజలు చేస్తానని.. మినిమం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇవ్వనిదే తాను డీల్ కుదుర్చుకోనని అఘోరీ చెప్పిందని అన్నారు. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

ప్రభాస్ ఇంటి పక్కన విల్లా

ఆ పూజలు కేవలం బడా బడా వ్యక్తులకే చేస్తానని.. చిన్న చిన్న వారికి చేయనని అఘోరీ చెప్పినట్లు వారు తెలిపారు. అలాగే యూట్యూబ్ ద్వారా రూ.20 లక్షలు వస్తాయని అఘోరీ వారితో చెప్పినట్లు వారు పేర్కొన్నారు. అది మాత్రమే కాకుండా తనకు హైదరాబాద్‌లో ప్రభాస్ ఇంటి పక్కన పెద్ద విల్లా ఉందని కూడా ఆమె చెప్పిందని.. దాని విలువ దాదాపు రూ.8 కోట్లు ఉంటుందని కూడా అఘోరీ వారితో చెప్పినట్లు వర్షిణీ పేరెంట్స్ తెలిపారు. 

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

(lady aghori | sri varshini | aghori sri varshini | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని సస్పెండ్

టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై రఘు ఇంజనీరింగ్ కాలేజ్ చర్యలు తీసుకుంది. యువతి వెంకటలక్ష్మీని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. కాలేజీలో విద్యార్థిని ఫోన్ లెక్చరర్ తీసుకున్నందుకు ఆమెను బూతులు తిడుతూ దాడికి దింగింది.

New Update
raghu clg

కాలేజ్‌లో టీచర్‌ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్‌పై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఆంద్రప్రదేశ్ విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఇది జరిగింది. టీచర్‌ను దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగింది యువతి. ఆ విద్యార్థిని టీచర్‌ను చెప్పుతో కొడుతున్నప్పుడు అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విద్యార్థిని ప్రవర్తన పట్ల ఇంటర్‌నెట్‌లో చాలా మంది సీరియస్ అయ్యారు. విద్యార్థిని గురుగుబెల్లి వెంకటలక్ష్మీని రఘు ఇంజనీరింగ్ కాలేజీ సస్పెండ్ చేసింది.

విద్యార్థిని.. ఆ ఫోన్ 12వేలు ఇస్తావా? ఇవ్వవా? అంటూ టీచర్‌ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. చివరికి ఫోన్ ఇస్తావా? లేదంటే చెప్పుతో కొట్టమంటావా అంటూ టీచర్ పై రెచ్చిపోయింది. దీంతో టీచర్ ఇవ్వను అనేసరికి ఆమెపై చెప్పుతో దాడి చేసింది. ఆ తర్వాత టీచర్ విద్యార్థిని మధ్య గొడవ పెరగడంతో పక్కనే ఉన్న విద్యార్థులు, ఇతర టీచర్లు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థిని తీరుపై  నెటిజన్లు మండిపడుతున్నారు.

(Raghu Engineering College | student | teacher | latest-telugu-news | viral-video)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు