AP:అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఏపీ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

ఏపీ నుంచి శబరిమల అయ్యప్పను దర్శించుకునే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. మచిలీపట్నం నుంచి కొల్లాంకు డిసెంబరు 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రత్యేకరైళ్లు నడుస్తాయి.

New Update
South Central Railway: ఆ రైళ్లు నెల రోజుల పాటు రద్దు!

AP:

ఏపీ నుంచి శబరిమలకు వెళ్లాలనుకునే అయ్యప్ప భక్తులకు రైల్వే అధికారులు తీపి కబురు చెప్పారు.విజయవాడ మీదుగా శబరిమలకు  ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మచిలీపట్నం-కొల్లాం (07145) స్పెషల్ ట్రైన్‌  డిసెంబరు 2, 9, 16 తేదీల్లో మచిలీపట్నంలో మధ్యాహ్నం 3.15కి బయలుదేరుతుంది.. మరుసటి రోజు రాత్రి 9.20కి కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు (07146) తిరుగు ప్రయాణంలో డిసెంబరు 4, 11, 18 తేదీల్లో కొల్లాంలో తెల్లవారుజామున 2.30కి బయలుదేరి రెండో రోజు ఉదయం 7 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. 

Also Read: TG-TET: నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు

ఈ రైలు ఏపీలోని మచిలీపట్నం, పెడన, గుడివాడ, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్‌లలో ఆగనుంది.మరో ప్రత్యేక రైలు (07147) మచిలీపట్నం-కొల్లాం మధ్య నడవనుంది. డిసెంబరు 23,30 తేదీల్లో మచిలీపట్నంలో మధ్యాహ్నం 12గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 9.20కి కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు (07148) తిరుగు ప్రయాణంలో డిసెంబరు 25, జనవరి ఒకటో తేదీల్లో కొల్లాంలో తెల్లవారుజామున 2.30కి బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 12 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. 

Also Read:  Holidays: విద్యార్థులకు శుభవార్త.. స్కూళ్లకు 4 రోజులు సెలవులే సెలవులు!

ఈ రైలు ఏపీలోని.. మచిలీపట్నం, పెడన, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, నంద్యాల, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట రైల్వే స్టేషన్‌లలో ఆగనుంది.మౌలాలి-కొల్లాం (07143) ప్రత్యేక రైలు డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో మౌలాలీలో మధ్యాహ్నం 11.30కు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు కొల్లాం చేరుతుంది. ఈ రైలు (07144) తిరుగు ప్రయాణంలో డిసెంబరు 8, 15, 22, 29 తేదీల్లో కొల్లాంలో తెల్లవారుజామున 2.30కి బయలుదేరి రెండో రోజు ఉదయం 10 గంటలకు మౌలాలీ చేరుతుంది. 

Also Read: AP Rains: ముంచుకొస్తున్న మరో అల్పపీడనం... ఆ రెండు రోజులు వానలే వానలు!

ఈ రైలుకి తెలంగాణలోని మౌలాలి, చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం రైల్వేస్టేషన్‌లలో స్టాప్‌ ఉంది. ఏపీలోని.. విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్‌లలో ఆగనుంది. ఈ రైళ్లకు అడ్వాన్స్‌ బుకింగ్‌ బుధవారం ఉదయం 8 గంటల నుంచి మొదలు కానుందని అధికారులు తెలిపారు.

Also Read: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.

New Update
cm chandra babu

cm chandra babu

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అర్హతలు

ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.

21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి. 

ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

https://apobmms.apcfss.in/  లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ నింపాలి.

andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes

Advertisment
Advertisment
Advertisment