గిరిజన మహిళలతో పవన్ కళ్యాణ్ థింసా డాన్స్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థింసా నృత్యం చేశారు. ఇవాళ మన్యం జిల్లా పర్యటించిన ఆయన స్థానిక గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. వర్షం పడుతున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా కాలు కదిపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

New Update
Deputy CM Pawan Kalyan Enjoying Dimsa Dance

Deputy CM Pawan Kalyan Enjoying Dimsa Dance Photograph: (Deputy CM Pawan Kalyan Enjoying Dimsa Dance )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మన్యం జిల్లా పర్యటించారు. అక్కడ గిరిజన గ్రామాల్లో డోలీల బాధలు ఉండకూడదు అనే ఉద్దేశంతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ థింసా నృత్యం చేశారు. అక్కడి స్థానిక గిరిజన మహిళలతో కలిసి ఆయన డాన్స్ వేశారు.

ఇది కూడా చూడండి: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!

వర్షం పడుతున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ నృత్యం చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా పవన్ ఇవాళ మక్కువ మండలం బాగుజోలలో పర్యటించారు. బాగుజోల గ్రామం నుంచి సిరివర వరకు రూ.9.50 కోట్లతో 9 కి.మీ మేర తారు రోడ్డుగా మార్చుతున్నామని హామీ ఇచ్చారు.

రూ.36.71 కోట్ల వ్యయంతో రోడ్డు పనులు

ఇది కూడా చూడండి: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలం, పనసభద్ర పంచాయతీలో రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. 55 గిరిజన ప్రాంతాలను కలిపేలా రూ.36.71 కోట్ల వ్యయంతో 39.32 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి పునాది వేశారు. ఇది పూర్తి కాగానే 3,782 మంది గిరిజనుల డోలీ కష్టాలు తీరనున్నాయి. అలాగే బాగుజోల గ్రామం నుంచి సిరివర వరకు రూ.9.50 కోట్ల వ్యయంతో 9 కి.మీ మేర తారు రోడ్డుగా మార్చుతున్నామన్నారు. 

OG OG అని అరిస్తే పనులు జరగవు

ఇది కూడా చూడండి: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు

తన జీవితంలో ఈర్ష్య ఉండదని అన్నారు. ఎవరైనా తన కంటే ఎత్తుకు ఎదిగినా.. విజయం సాధించినా అసూయ ఉండదని తెలిపారు. అనంతరం షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అనంతరం అభిమానులకు చురకలు పెట్టారు. తనను పని చేసుకోనివ్వండని.. తాను బయటికొస్తే తన మీద పడిపోతే తాను ఏ పని చేయలేనని అన్నారు. 

అలాగే OG OG అని అరిస్తే పనులు జరగవని అన్నారు. ఇక సీఎం సీఎం అంటారు.. డిప్యూటీ సీఎం అయ్యాను కదా అని తెలిపారు. హీరోలకు జేజేలు కొట్టండి కానీ.. మీ జీవితాలపై దృష్టి పెట్టండి అని పవన్ పేర్కొన్నారు.  ‘‘సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారన్నారు’’. అని అన్నారు.

ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు

మాట్లాడితే మీసం తిప్పు, మీసం తిప్పు అంటారని.. అయితే మీసం తిప్పితేనో, ఛాతిలు కొట్టుకుంటేనో పనులు జరగవు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దీంతో పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అల్లు అర్జున్‌ను ఉద్దేశించే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala High Alert :  పహల్గాంలో ఉగ్రదాడి..తిరుమలలో హై అలర్ట్

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమతిలోనూ హై అలర్ట్‌ ప్రకటించారు.

New Update
Tirumala High Alert

Tirumala High Alert

Tirumala High Alert :  జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమతిలోనూ హై అలర్ట్‌ ప్రకటించారు. కొండపై భద్రతను విజిలెన్స్ సిబ్బంది కట్టుదిట్టం చేశారు. కశ్మీర్‌లోని పహల్గాం దాడి నేపథ్యంలో తిరుమలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!
కొండపై సెక్యూరిటీ కట్టుదిట్టం చేసినట్లు  టీటీడీ వెల్లడించింది. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే అన్ని వాహనాలను, భక్తులను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. మొదట అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులో పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, అందులోని లగేజీని సైతం వదలకుండా తనిఖీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చెబుతోంది. శ్రీవారి ఆలయ పరిసరాలలోనూ భద్రతను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. నిఘవర్గాల హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం తిరుమలలో కూడా భద్రత కట్టుదిట్టం చేసింది.

 

 


 Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

తిరుమలకు అలిపిరి మీదుగా వాహనాలతో పాటుగా కాలినడకన వచ్చే రెండు మార్గాలు ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టు నడకమార్గం ఉంది. తిరుమలకు వాహనాల్లో వెళ్లే భక్తుల లగేజీని అలిపిరి సప్తగిరి చెకింగ్ పాయింట్ దగ్గర తనిఖీలు చేస్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గంలో వెళ్లే భక్తుల లగేజీని కూడా చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండటం, కాశ్మీర్ ఉగ్రదాడితో తిరుమలలో కూడా హై అలర్ట్ ప్రకటించారు.. దేశంలో మరోసారి ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో తిరుమలలో భద్రతలను కట్టుదిట్టం చేశామన టీటీడీ వర్గాలు స్పష్టం చేశాయి.

ఇది కూడా చదవండి: ఈ పండ్లు తింటే క్యాన్సర్‌ పరార్.. ఆ అద్భుతమైన ఆహారాలు ఇవే
 
మరోవైపు ఆక్టోపస్‌ దళం కూడా అప్రమత్తమైంది. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి.. భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఆక్టోపస్ టీమ్ తిరుమల శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ చేసింది. ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా, భ‌ద్రతా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరిస్తారు. గతేడాది మార్చిలో తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే తిరుమల ఆలయం దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.. 24 గంటలు సాయుధ బలగాల పహారాలో కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. మొత్తం మీద కాశ్మీర్ ఉగ్రదాడి ప్రభావం తిరుమలపై కూడా కనిపించింది.. ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!

Advertisment
Advertisment
Advertisment