Alekhya Chitti Pickles Issue: బలుపు ఎక్కువైంది.. అలేఖ్య చిట్టి పై యూట్యూబర్ అన్వేష్ షాకింగ్ వ్యాఖ్యలు!

అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీపై యూట్యూబర్ నా అన్వేష్ స్పందించాడు. ‘అలేఖ్య అలా తిట్టి ఉండకూడదు. వాళ్లు నా చెల్లెల్లాంటివారు. వారిని క్షమించండి. వారి కర్మబాగోలేక, బలుపు ఎక్కువై అలా చేసింది. త్వరలో లడ్డూ బిజినెస్ పెట్టబోతున్నారు’ అని చెప్పుకొచ్చాడు.

New Update
Naa Anveshana Reaction on Alekhya Chitti Pickles Controversy

Naa Anveshana Reaction on Alekhya Chitti Pickles Controversy

గత మూడు రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అలేఖ్య చిట్టి ఆడియో రచ్చ రచ్చ చేస్తుంది. పచ్చళ్లు రేటు ఎక్కువగా ఉన్నాయని అడిగిన కస్టమర్లపై అలేఖ్య బూతులతో రెచ్చిపోయిన విధానం నెటిజన్లను చిర్రెత్తించింది. ప్రస్తుతం ఇదే నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

నా అన్వేష్ షాకింగ్ రియాక్షన్ 

ప్రస్తుతం ఇదే కాంట్రవర్సీపై ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ స్పందించాడు. సుమ, అలేఖ్య, రమ్య తనకు చెల్లెల్లతో సమానమని అన్నాడు. అలేఖ్య బూతులపై తన తరఫున క్షమాపణలు చెబుతున్నాను అని పేర్కొన్నాడు. వాళ్లు యూట్యూబ్‌ ఛానెల్ స్టార్ట్ చేసేటప్పుడు తనను సంప్రదించారని తెలిపాడు. అందుకు తాను సలహాలు, సూచనలు కూడా ఇచ్చానని అన్నాడు. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

అంతేకాకుండా వారు బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారని సంచలన విషయాలు బయటపెట్టాడు. కానీ తాను వద్దని చెప్పగానే వారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడం ఆపేశారని అన్నాడు. అలేఖ్య బూతులు మాట్లాడకుండా ఉండాల్సింది. సోషల్ మీడియా ట్రోలింగ్స్‌తో అలేఖ్య అనారోగ్యానికి గురైందని అన్నాడు. ఆమె ప్రస్తుతం హాస్పిటల్‌లో ఐసీయూలో ఉందని తెలిపాడు. అందువల్ల వారిని ఇకనుంచి వదిలేయండి అంటూ వేడుకున్నాడు. 

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

అంతేకాకుండా ఇప్పుడు పచ్చళ్ల బిజినెస్ పూర్తిగా బంద్ అయిందని.. త్వరలో లడ్డూల బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారంటూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. అలేఖ్య చెల్లి రమ్య త్వరలో పూతరేకులు, స్వీట్స్, లడ్డూ వంటివాటితో కొత్త బిజినెస్ పెట్టబోతున్నారని తెలిపాడు. ఇదేదో రాష్ట్ర సమస్యలాగ తిడుతున్నారని.. ఈ వ్యవహారం ఏకంగా దేశాలు దాటిపోయిందని అన్నాడు. 

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

బలుపు ఎక్కువై

ఫ్రస్టేషన్‌లో కస్టమర్లను తిట్టిందని.. వ్యాపారం చేయడం చేతకాక అలా చేసిందని అన్నాడు. బీపీ ఎక్కువై, కర్మబాగోలేక, ఇంకా చెప్పాలంటే బలుపు ఎక్కువై తిట్టేసిందని అన్నాడు. ఇప్పుడు అంతా అయిపోయింది. దుకాణాలన్నీ బంద్ అయిపోయాయి. అందువల్ల బీపీ, నోటుదూల ఉన్నోళ్లకు బిజినెస్ పనిచెయ్యదు అని చెప్పుకొచ్చాడు. దీంతో పాటు మరెన్నో షాకింగ్ విషయాలు తెలిపాడు.

(naa anveshana | latest-telugu-news | telugu-news | alekhyaa chitti pickle | alekhya chitti pickles controversy)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP liquor scam : ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో మరో సంచలనం...  సజ్జల శ్రీధర్‌ రెడ్డి అరెస్ట్

వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో వరుస అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇటీవలె కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసిన సిట్ అధికారులు తాజాగా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
SAJJALA SREEDHAR REDDY

SAJJALA SREEDHAR REDDY

AP liquor scam : వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో వరుస అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇటీవలె కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసిన సిట్ అధికారులు తాజాగా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో శ్రీధర్‌ రెడ్డి ఏ6గా ఉన్నారు. ఆయనను కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు. లిక్కర్ స్కామ్‌లో సూత్రధారి రాజ్‌ కసిరెడ్డి కాగా.. కమీషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్‌ రెడ్డి కీలకంగా వ్యహించినట్లుగా సీట్ గుర్తించింది. ఇదే కేసులో ఇప్పటికే రాజ్‌ కసిరెడ్డి (ఏ1), ఆయన తోడల్లుడు చాణక్య (ఏ8)ను అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త మద్యం పాలసీని అడ్డు పెట్టుకుని ప్రతినెలా రూ.60 కోట్ల మేర ముడుపులు సేకరించాలనే విషయంలో ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, నాటి ఐటీ సలహాదారు రాజ్‌ కసిరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్‌ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్‌ స్పెషల్ ఆఫీసర్ సత్య ప్రసాద్‌తో కలిసి శ్రీధర్‌రెడ్డి కూడా కుట్రలు చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే కేసులో శ్రీధర్‌ రెడ్డిని అరెస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

శ్రీధర్‌ రెడ్డి వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి వ్యాపారంలో వాటా ఇచ్చి, వేల కోట్ల మద్యం వ్యాపారం చేసి వందల కోట్లు వెనకేసుకున్నట్లు సిట్‌ అధికారులు సమాచారం సేకరించారు. కొన్నాళ్లుగా ఆయన కదలికలపై దృష్టి సారించారు. ఎట్టకేలకు... శుక్రవారం సాయంత్రం శ్రీధర్‌ రెడ్డిని అరెస్టు చేసి. విజయవాడకు తీసుకొచ్చారు. శనివారం ఆయనను ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతారు.

Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
   
మద్యం కుంభకోణంలో సజ్జల శ్రీధర్‌రెడ్డి పాత్ర గురించి చాణక్య రిమాండ్‌ రిపోర్టులోనే ‘సిట్‌’ క్లుప్తంగా వివరించింది. దీని ప్రకారం... 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణ హోటల్లో శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో ఒక భేటీ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని మద్యం డిస్టిలరీస్‌ యజమానులను రప్పించారు. లిక్కర్‌ సరఫరా చేయాలంటే కనీసం 12శాతం కమీషన్‌ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు.  

Also Read: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

హైదరాబాద్‌లోని స్టార్‌ హోటళ్లలో సజ్జల శ్రీధర్‌ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి, రాజ్‌ కసిరెడ్డి, అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్య ప్రసాద్‌ పలుమార్లు చర్చలు జరిపారు. కమీషన్లు ఇచ్చే కంపెనీలకే ఆర్డర్లు వెళ్లాయి. అలాగే అప్పటికే ఏపీలో ఉన్న డిస్టిలరీస్‌ను బలవంతంగా లాక్కుని సొంతంగా మద్యం తయారు చేయడం మొదలుపెట్టారు. శ్రీధర్‌రెడ్డి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీ్‌లో మిథున్‌రెడ్డికి వాటా వచ్చేలా ప్లాన్‌ చేశారు. వైసీపీ హయాంలో మద్యం దుకాణాల్లో పుష్కలంగా అందుబాటులో ఉన్న సదరన్‌ బ్లూ, నైన్‌ హార్స్‌ వంటివి వీరి ఉత్పత్తులే కావడం గమనార్హం.

Also Read :  మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

Advertisment
Advertisment
Advertisment