AP News : తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పై లోకేష్ ప్రకటన..! ఎప్పటి నుంచంటే...

ఏపీలో గెలిచేందుకు కూటమి ప్రభుత్వం అనేక హామీలిచ్చింది.వాటిలో కొన్నింటిని ఇప్పటికే అమలు చేస్తోంది. అయితే కూటమి ఇచ్చిన రెండు కీలక పథకాలు మాత్రం ఇంతవరకు అమలు కాలేదు. హామీలన్నీ అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

New Update
Annadata Sukhibhava

Annadata Sukhibhava

AP News : ఏపీలో గెలిచేందుకు కూటమి ప్రభుత్వం అనేక హామీలిచ్చింది. వాటిలో కొన్నింటిని ఇప్పటికే అమలు చేస్తోంది. కొన్నింటిపైనా చర్చ జరుగుతోంది. అయితే కూటమి పార్టీలు ఇచ్చిన రెండు కీలక పథకాలు మాత్రం ఇంతవరకు అమలు కాలేదు.  దీంతో అబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. హామీలన్నీ అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read :  విమానం లోపల కమ్మేసిన పొగ మంచు.. ఊపిరాడకపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్!

ఈ రెండు పథకాల్లో తల్లికి వందనంగా పేరు మారిన అమ్మఒడి పథకం, అన్నదాత సుఖీభవగా పేరు మారిన రైతు భరోసా ఉన్నాయి. ఈ రెండు పథకాల అమలుపై ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్నప్పటికీ ఇప్పటివరకు అమలుకు నోచులకోలేదు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ మండలిలో కీలక ప్రకటన చేసారు. ఇవాళ శాసన మండలి సమావేశాలు వాడీవాడిగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలు పథకాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. తాము అమలు చేసిన పథకాలన్నీ కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టేసిందని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించి సమాధానం ఇచ్చారు. శాసనమండలి సాక్షిగా చెప్తున్నా ఏప్రిల్, మే నెలల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు. కూటమి ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: Hyderabad: టాప్‌-10లో హైదరాబాద్‌ చారిత్రక ప్రదేశాలు.. అత్యధిక పర్యాటకుల సందర్శనతో రికార్డు!

 రాష్ట్రంలో ఈ ఏడాది బడ్జెట్ తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల పథకాలు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారు. అలాగే కీలకమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను జూన్ లోపు అమలు చేయాలని నిర్ణయించారు. తల్లికి వందనం పథకాన్ని విద్యాసంవత్సరం ప్రారంభంలోపే ఇచ్చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లోనే ఈ రెండు పథకాలు అమలు చేసి తీరుతామని లోకేష్ చేసిన ప్రకటన లబ్దిదారుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.

Also Read :  ఏనుగుల దాడిపై పవన్ దిగ్భ్రాంతి.. రూ.10 లక్షలు ఆర్థిక సాయం!
 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cricket Betting : క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలి

బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బుద్వేల్‌ కు చెందిన బీటెక్ విద్యార్థి క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి బలయ్యాడు.

New Update
Cricket Betting

Cricket Betting

Cricket Betting : బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకుని ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే బుద్వేల్‌లో చోటు చేసుకుంది.

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. డబ్బులు అధికంగా వస్తాయన్న ఆశతో బెట్టింగ్‌లో పాల్గొన్న యువకుడు చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన బుద్వేల్‌లో విషాదాన్ని నెలకొల్పింది. బుద్వేల్‌కు చెందిన పవన్ కుమార్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఐపీఎల్ సీజన్ అంటేనే బెట్టింగ్ రాయుళ్లు పండగ చేసుకుంటారు. ఈ ఒక్క ఐపీఎల్ సీజన్ లోనే బెట్టింగ్ దందాలో కోట్లు చేతులు మారతాయి. ఈ బెట్టింగుల ద్వారా ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు యువకులు డబ్బు పోగోట్టుకొని మనస్థాపంతో ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

పవన్ కడా ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్‌కు లోనయ్యాడు. మొదట్లో స్వల్ప లాభాలు రావడంతో ఆశ పెరిగింది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో అంటే సుమారు 80 వేలు బెట్టింగ్ పెట్టాడు. అయితే.. పెట్టిన మొత్తాన్ని నష్టపోయిన పవన్‌ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. పరిస్థితిని తట్టుకోలేక ఇంటి గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని పవన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎదిగిన కొడుకు బెట్టింగ్ భూతానికి బలవ్వడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

Advertisment
Advertisment
Advertisment