Video: పెట్రోల్ పోసుకుని అఘోరీ ఆత్మహత్యాయత్నం.. గన్ తో కాల్చేయండి అంటూ

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షమైన అఘోరీ తాజాగా శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకుంది. ఆలయంలోకి అనుమతించకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని.. కావాలంటే గన్ తో చంపేయండని ఫైర్ అయింది.

New Update
Lady Aghori,

తెలంగాణలో అఘోరీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అక్కడి నుంచి వెళ్లిపోయిన అఘోరీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షమైంది. తాజాగా శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకుంది. కానీ పోలీసులు ఆమెను ఆలయంలోకి అనుమతించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన అఘోరీ పోలీసులపై ఫైర్ అయింది. ఈ క్రమంలోనే తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అక్కడున్న లేడీ సెక్యూరిటీ అఘోరీపై నీళ్లుపోసి బట్టలు కట్టే ప్రయత్నం చేయగా.. తాను అఘోరీనని బట్టలు కట్టను అంటూ అరుపులు అరిచింది. 

Also Read : ట్రేడింగ్ పేరుతో స్కాం.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగికి రూ.2.29 కోట్ల టోకరా

గన్‌తో షూట్ చేసి చంపేయండి

అనంతరం అఘోరీ పోలీసులతో మాట్లాడింది. దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని తెలిపింది. కావాలంటే గన్‌తో షూట్ చేసి చంపేయండి అంటూ మండిపడింది. ఇప్పటివరకు తనను ఎవరు అడ్డుకోలేదని.. మీ పోలీసుల పని తనను అడ్డుకోవడమా అని ప్రశ్నించింది.

రాష్ట్రంలో చిన్నపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే మీ పోలీసులు ఏం చేస్తున్నారని అడిగింది. మీ పోలీసులు ఉన్నది కేవలం నటించడానికే కానీ ప్రజలకు సేవ చేయడానికి కాదు అని ఫైర్ అయింది. ఈ మేరకు తాను చట్టాన్ని నమ్మనని.. కేవలం తన ధర్మాన్ని మాత్రమే నమ్ముతానని పేర్కొంది. అయితే నగ్నంగా దర్శనానికి అనుమతి ఇవ్వలేమంటూ పోలీసులు చెప్పి.. అఘోరీని అంబులెన్స్‌లో అక్కడి నుంచి పంపించేశారు.

Also Read : సీఎం రేవంత్‌పై కేసు పెట్టాలని పిటిషన్!

టోల్ ప్లాజా వద్ద హల్ చల్

కాగా ఇటీవల తెలంగాణ నుంచి వెళ్లిపోయిన అఘోరీ రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో దర్శనమిచ్చింది. ఊహించని విధంగా సోమవారం సాయంత్రం విశాఖ దగ్గరలో నక్కపల్లి మండలంలో హల్చల్ చేసింది. తన కారులో అన్నవరం నుంచి విశాఖవైపు వస్తూ వేంపాడు టోల్ ప్లాజా వద్ద ప్రత్యక్షమైంది.

Also Read : 'అమరన్' సక్సెస్ మీట్.. నితిన్ హిట్ సాంగ్ ను తెలుగులో పాడిన శివకార్తికేయన్

దీంతో ఆత్రంగా స్థానికులు, టోల్ ప్లాజా సిబ్బంది ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఇదే సమయంలో ఒక వ్యక్తి తనపై చేయి వేసి, తాకరాని చోట తాకాడంటూ ఆమె గొడవకు దిగింది. అతనెవరో తనకు తెలియాలని, సీసీ కెమెరా పుటేజీ కావాలని డిమాండ్ చేసింది. 

Also Read : నాని - శ్రీకాంత్ ఓదెల మూవీకి డిఫరెంట్ టైటిల్.. అస్సలు ఉహించలేదే

ఈ సందర్భంగా లేడీ అఘోరీ మాట్లాడుతూ ఏపీలో కూడా మహిళలకు రక్షణ లేదని, నిత్యం శివ సాన్నిధ్యంలో వుండే తనపై అసభ్యంగా ప్రవర్తిస్తే, మహిళలకు రక్షణ ఎక్కడ వుంటుందని పేర్కొంది. తాను సనాతన ధర్మ పరిరక్షణ కోసమే కృషి చేస్తున్నానని తెలిపింది. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గనని.. అవసరమైతే ప్రాణత్యాగం అయినా చేస్తానని చెప్పింది. తనలాంటి నాగ సాదువులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. ఈ లోగా అక్కడకు చేరుకున్న సీఐ కుమారస్వామి, ఎస్ఐ సన్నిబాబు ఆమెకి సర్దిచెప్పి పంపించేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori First Wife: అఘోరీని ఉరి తియ్యండి.. వాడికి భయంకరమైన శక్తులు- మొదటి భార్య సంచలన నిజాలు!

అఘారీ మొదటి భార్య రాధిక సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది. అఘోరీకి ఉరిశిక్షే సరైన న్యాయమని తెలిపింది. ఆమెకు భయంకరమైన వశీకరణ శక్తులు ఉన్నాయని పేర్కొంది. తాను కూడా అఘోరీ ఏం చెప్తే అది వినేదాన్ని అని తెలిపింది. దీంతో ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

New Update

అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఎపీసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. అనంతరం 14 రోజుల రిమాండ్‌ కోసం సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. అయితే అక్కడ మరింత హైడ్రామా నడిచింది. అఘోరీ జండర్ తెలీకుండా జైల్లో ఉంచుకోమంటూ జైలు అధికారులు చెప్పడంతో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల అనంతరం అఘోరీ ట్రాన్స్‌జెండర్‌గా నిర్దారించి జైల్లో ప్రత్యేక బ్యారక్‌లో ఉంచారు. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

పూర్తిగా జైల్లోకి వెళ్తేనే

ఈ నేపథ్యంలో అఘోరీ సంబంధించి చాలా మంది బాధితులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మొదటి మోసపోయింది మాత్రం నేనే అంటూ అఘోరీ ఫస్ట్ వైఫ్ రాధిక మీడియా ముందుకు వచ్చారు. తాజాగా రాధిక మరోసారి RTVతో మాట్లాడింది. ఇందులో భాగంగా అఘోరీకి సంబంధించిన మరిన్ని విషయాలు పంచుకుంది. అఘోరీ అరెస్ట్ అవడం తనకు ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపింది. కానీ ఇది కేవలం సగం మాత్రమేనని.. పూర్తిగా జైల్లోకి వెళ్లిన తర్వాతే తాను ఫుల్ హ్యాపీగా ఉంటానని తెలిపింది. 

Also Read : ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

పురుష బాధితులు

అఘోరీ దైవం అనే ముసుగులో వచ్చినపుడు దైవభక్తితోనే ఉండాలే తప్ప.. కూతురు, శిష్యురాలు అని చెప్పి పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని తెలిపింది. అఘోరీ బాధితులు చాలా మందే ఉన్నారని పేర్కొన్నారు. ఆ లిస్టులో ఆడవారే కాకుండా మగవారు కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. అఘోరీ ఒక ట్రాన్సజెండర్.. అతడు తన మాటలతో ఎవరినైనా మాయ చేసేస్తాడు. ఎలాంటి వారినైనా లొంగదీసుకుంటాడు. అఘోరీ మాయలో పడిన వారు బయటకు రావడం చాలా కష్టం అని ఆమె తెలిపారు. 

ఉరిశిక్ష పడాల్సిందే

ఆయన మాటలకు ఎవరైనా పడిపోవలసిందే అని చెప్పుకొచ్చింది. ఇక అఘోరీకి కఠిన శిక్ష పడాలని.. అది కూడా ఉరిశిక్ష వేయాలని తెలిపింది. అదే అసలైన న్యాయం అని పేర్కొంది. అఘోరీకి వశీకరణ శక్తులు ఉండొచ్చని.. తాను కూడా అఘోరీ ఉన్నంత సేపు ఏం చెప్తే అదే వినేదాన్ని అని తెలిపింది. దీంతో ప్రస్తుతం ఆమె చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

aghori Arrest | lady aghori arrest | lady aghori arrest news | lady aghori arrest updates | Radha Reaction On Aghori Arrest | latest-telugu-news | telugu-news | Aghori First Wife

Advertisment
Advertisment
Advertisment