Botsa Satyanarayana: నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలి
చంద్రబాబు నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అవినీతి కార్యక్రమాలు చేశారని బొత్స మండిపడ్డారు.
చంద్రబాబు నిజాయితీ పరుడైతే కోర్టులో నిరూపించుకోవాలని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అవినీతి కార్యక్రమాలు చేశారని బొత్స మండిపడ్డారు.
చిత్తూరు జిల్లా కుప్పం టీడీనీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా బంద్కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. మరోవైపు కుప్పంలో బంద్ కొనసాగుతోంది. దుకాణాలు మూతపడ్డాయి, మరోవైపు బస్టాండ్కే ఆర్టీసీ బస్సులు పరిమిత మయ్యాయి.
నాపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారన్నాని ఫైర్ అయ్యారు చంద్రబాబు. నేనేమన్నా టెర్రరిస్టునా.. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆయనకు మెడికల్ టెస్టులు చేశారు. ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్ ద్వారా చంద్రబాబును విజయవాడ తరలించారు. ఇది నాన్ బెయిలబుల్ నేరమని చెబుతూ బెయిల్పై విడుదల చేయలేమని నోటీసులో పేర్కొంది. మీరు కోర్టు ద్వారా మాత్రమే బెయిల్ కోరవచ్చు' అని సీఐడీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం ధనుంజయుడు నోటీసులో స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో పోలీసులు అరెస్టు చేశారు. అయితే తన అరెస్టుకు కారణం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబును దగ్గరకు పోలీసులు వెళ్లనివ్వకుండా అడ్డుగా నిలబడి పోలీసు అధికారులతో టీడీపీ నాయకులు గొడవకు దిగారు . ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబును అరెస్ట్ చేశారు
కర్నూలు జిల్లా లోకాయుక్త ఆఫీసులో గన్ ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో ఏఆర్ హెడ్కానిస్టెబుల్ సత్య నారాయణ మరణించారు. లోకాయుక్త బందోబస్తుకు ఏఆర్ కానిస్టేబుల్ సత్యనారాయణ వచ్చినట్లు సమాచారం. బాత్రూమ్లో ఎస్ఎల్ఆర్తో సత్యనారాయణ కాల్పుకున్నట్లు సమాచారం.
టమాటా ధరలతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఉంటే అతివృష్టి.. లేకుంటే అనావృష్టి.. అన్నట్లుగా ఉంది టమోటా రైతుల పరిస్థితి.సెంచరీ, డబుల్ సెంచరీ దాటి కొనుగోలుదారులకు కన్నీళ్లు తెప్పించిన టమాటా... ఇప్పుడు అన్నదాతలకు కంట నీరు తెప్పిస్తుంది. గత నెలలో టమాటా ధర కిలో రూ.200కు పైన పలికింది.అయితే, ఇప్పుడు రూ.1కి కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.దీంతో టమాటాను రైతులు రోడ్ల మీద పారబోస్తున్నారు.
నేటి బిజీ ప్రపంచంలో సక్సెస్ కావాలంటే మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. నలుగురిలో స్పెషల్గా ఏమైనా చేయాలి. అప్పుడే జీవింతో విజయవంతం అవుతాం. ఈ సూత్రం ముఖ్యంగా వ్యాపారంలో బాగా వర్తిస్తుంది. ఫుడ్ బిజినెస్లో అయితే కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం రెస్టారెంట్ నిర్వాహకులు అందరికంటే వినూత్నంగా ఆలోచించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఓ మహిళ తన వీరాభిమాన్నాని చాటుకుంది. కర్నూలు జిల్లా ఆదోనిలో రణమండల ఆంజనేయస్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. పవన్ కల్యాణ్ సీఎం కావాలంటూ ఓ మహిళ మోకాళ్లపై ఆదోని కొండ ఎక్కింది. ఎంతో కష్టమైనప్పటికీ ఆమె మోకాళ్లపై కొండ ఎక్కిన తీరు చూసి జనసేన అభిమానులు ఔర అంటున్నారు.